
Train Food Taste: రైలు ప్రయాణాల్లో ప్యాక్ చేసిన క్యారేజ్ ఆహారం లేదా ప్లాట్ఫారమ్లపై కొనుగోలు చేసే టిఫిన్లు, భోజనం తిన్నప్పుడు చాలామందికి ఒకే ఫిర్యాదు ఉంటుంది. “ఇంట్లో తిన్నంత రుచిగా లేదు” అని. సాధారణంగా పాంట్రీ కార్ సిబ్బంది సరిగ్గా వండలేదని భావిస్తుంటాం. కానీ దీని వెనుక మన శరీరంలో జరిగే సైంటిఫిక్ మార్పులు, ప్రయాణ వాతావరణం కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు నిపుణులు.
ఇది కూడా చదవండి: Most Expensive Home: భారత్లోనే 2వ అత్యంత ఖరీదైన ఇల్లు ఎవరిదో తెలుసా..? ఎక్కడుంది?
రైళ్లలోని క్లోజ్డ్ ఏసీ బోగీల్లో తేమ శాతం చాలా తక్కువగా ఉంటుంది. నిరంతరం ప్రసరించే శీతల గాలి వల్ల మన ముక్కు లోపలి పొరలు పొడిబారుతాయి. మనం ఆహార రుచిని ఆస్వాదించడంలో 80% పాత్ర మన వాసన చూసే శక్తిదే. ముక్కు పొడిబారడం వల్ల సువాసనలను పసిగట్టే సామర్థ్యం తగ్గి, ఎంత మంచి వంటకమైనా చప్పగా అనిపిస్తుంది.
రైలు ప్రయాణంలో పట్టాలపై వెళ్లేటప్పుడు వచ్చే నిరంతర శబ్దం, వైబ్రేషన్లు మన నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతాయి. సైన్స్ పరిశోధనల ప్రకారం, పెద్ద శబ్దాలు ఉన్న వాతావరణంలో నాలుకకు ఉప్పు, తీపి రుచులను గుర్తించే శక్తి దాదాపు 20% నుండి 30% వరకు తగ్గుతుందట.
రైల్వే కేటరింగ్లో వేలాది మంది ప్రయాణికులకు ఒకేసారి వంట తయారవుతుంది.
ప్యాకింగ్ చేసిన తర్వాత ప్రయాణికుడి చేతికి వచ్చేసరికి ఆహారం దాని ప్రాథమిక ఆకృతిని (Texture) కోల్పోతుంది. వేడి తగ్గడం లేదా మళ్లీ రీహీట్ చేయడం వల్ల చపాతీలు గట్టిగా మారడం, అన్నం పొడిబారడం వంటివి జరుగుతాయి.
ఇంటి వంటలో ప్రేమ, శ్రద్ధతో పాటు మన అలవాటైన మసాలాల కాంబినేషన్ ఉంటుంది. కానీ వ్యాపార దృక్పథంతో చేసే రైలు ఆహారంలో వ్యక్తిగత రుచులు, పరిశుభ్రత స్థాయిలు మారడం వల్ల మానసిక తృప్తి లభించదు.
ఏసీ బోగీల్లో ప్రయాణించేటప్పుడు తగినంత నీరు తాగుతూ శరీరాన్ని, నాసికా రంధ్రాలను హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. ఘాటైన వాసన లేదా ఉమామి (Umami) రుచి ఎక్కువగా ఉండే ఆహారాలు (టమాటో బేస్, పులుపు లేదా ఎక్కువ మసాలా ఉన్న వంటకాలు) రైలు ప్రయాణాల్లో మెరుగైన రుచిని ఇస్తాయి.
ఇది కూడా చదవండి: Business Idea: కేవలం 300 పెట్టుబడితో రోజుకు రూ.2100 సంపాదించండి.. ఏంటి నమ్మడం లేదా? ఇదిగో వివరాలు!
ఇది కూడా చదవండి: Success Story: ఒకే దుకాణం.. నాలుగు వ్యాపారాలు.. నెలకు రూ.4 లక్షల ఆదాయం.. గ్రాడ్యుయేట్ సక్సెస్ సీక్రెట్ ఇదే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి