Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 248, నిఫ్టీ 74 పాయింట్లు అప్..

గ్లోబల్ మార్కెట్ల సానుకూల మద్దతుతో భారతీయ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి...

Stock Market: లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్ 248, నిఫ్టీ 74 పాయింట్లు అప్..
Stock Market

Updated on: Mar 03, 2022 | 9:58 AM

గ్లోబల్ మార్కెట్ల సానుకూల మద్దతు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎనర్జీ స్టాక్‌ల లాభాల కారణంగా భారతీయ స్టాక్‌ మార్కెట్లు(Stock Market) శుక్రవారం సానుకూలంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్(sensex) 248 పాయింట్లు పెరిగి 55717 వద్ద, నిఫ్టీ(NIfty) 74 పాయింట్లు పెరిగి 16679.40 వద్ద ట్రేడవుతున్నాయి. దాదాపు 1,624 షేర్లు పురోగమించగా, 236 షేర్లు క్షీణించాయి. 45 షేర్లు మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, ఒఎన్‌జిసి, ఐఒసి, యుపిఎల్, టాటా స్టీల్ ప్రధాన లాభాల్లో ఉండగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, సిప్లా నష్టపోయాయి. మరోవైపు బ్రెంట్ బ్యారెల్‌కు $116 డాలర్లకు చేరింది.

నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.70 శాతం, స్మాల్ క్యాప్ షేర్లు 1.15 శాతం లాభపడడంతో మిడ్, స్మాల్ క్యాప్ షేర్లు సానుకూలంగా ఉన్నాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లోని సెక్టార్లు గ్రీన్‌లో ట్రేడవుతున్నాయి. నిఫ్టీ ఐటి, నిఫ్టీ ఆయిల్ & గ్యాస్ వరుసగా 1.38 శాతం, 1.37 శాతం పెరిగాయి. అయితే, నిఫ్టీ ఆటో 0.20 శాతం వరకు పడిపోయింది. విప్రో, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌ కూడా లాభాల్లో ఉన్నాయి. దాదాపు 1,624 షేర్లు పురోగమించగా, 236 షేర్లు క్షీణించాయి. 45 షేర్లు మారలేదు. నిఫ్టీలో కోల్ ఇండియా, ఒఎన్‌జిసి, ఐఒసి, యుపిఎల్, టాటా స్టీల్ ప్రధాన లాభాల్లో ఉండగా హెచ్‌డిఎఫ్‌సి లైఫ్, ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే ఇండియా, సిప్లా నష్టపోయాయి.

Read Also..Edible Oils Prices: హోలీకి ముందే జేబు ఖాలీ..! భారీగా పెరిగిన వంట నూనె ధరలు..

Loading...
Unable to load recommendations.
Follow Us