GST Collection: జీఎస్టీ ద్వారా ప్రభుత్వాలకు భారీ ఆదాయం.. జూలై నెలలో ఎంతో తెలుసా..?

|

Aug 01, 2023 | 4:34 PM

దేశంలో గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) ప్రతినెలనెల అధిక సంఖ్యలు వసూలు వస్తున్నాయి. ఈ జీఎస్టీ లాభాల కారణంగా ప్రభుత్వాలకు భారీగా ఆదాయం వచ్చి చేరుతుంది. ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు, దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతర్రాష్ట్ర విక్రయాల సెటిల్‌మెంట్ తర్వాత జూలైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. జూలైలో దేశీయ లావాదేవీల (దీనిలో సేవల దిగుమతి) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన..

GST Collection: జీఎస్టీ ద్వారా ప్రభుత్వాలకు భారీ ఆదాయం.. జూలై నెలలో ఎంతో తెలుసా..?
Gst
Follow us on

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జూలైలో వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) ఆదాయంలో రూ.1.65 ట్రిలియన్లు వసూలు చేశాయి. ఇది ఏడాది క్రితం ఇదే కాలం కంటే 11 శాతం ఎక్కువ. జీఎస్టీ ఆదాయం 1.6 ట్రిలియన్లకు పైగా రావడం ఇది ఐదోసారి అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నెలవారీ సగటు వసూళ్లు రూ.1.65 లక్షల కోట్లుగా ప్రభుత్వం అంచనా వేసింది. రెండవ త్రైమాసిక మొదటి నెలలో గూడ్స్‌ సర్వీస్‌ ట్యాక్స్‌ (జీఎస్టీ) ఆదాయం ఏప్రిల్‌లో 1.87 ట్రిలియన్ల రికార్డు కలెక్షన్ తర్వాత ఈ సంవత్సరం ఇప్పటివరకు రెండవ అత్యధిక ఆదాయ సేకరణ.

ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (ఐజీఎస్టీ) నుంచి రూ.41,239 కోట్లు, దిగుమతులపై జీఎస్టీ సెస్ ద్వారా రూ.840 కోట్లు ప్రభుత్వం వసూలు చేసింది. అంతర్రాష్ట్ర విక్రయాల సెటిల్‌మెంట్ తర్వాత జూలైలో కేంద్రం రూ.69,558 కోట్లు, రాష్ట్రాలు రూ.70,811 కోట్లు జీఎస్టీ ఆదాయంలో తమ వాటాగా వసూలు చేశాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటన తెలిపింది. జూలైలో దేశీయ లావాదేవీల (దీనిలో సేవల దిగుమతి) ఆదాయం గత ఏడాది ఇదే నెలలో ఈ వనరుల నుంచి వచ్చిన ఆదాయం కంటే 15 శాతం ఎక్కువ అని ప్రకటన పేర్కొంది.

ఇవి కూడా చదవండి

ఏ రాష్ట్రాలు ఎంత సంపాదించాయి..?

పెద్ద రాష్ట్రాలు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు రెండంకెల ఆదాయాన్ని వసూలు చేశాయి. జూలైలో ఢిల్లీ జీఎస్టీ ఆదాయంలో 25 శాతం వృద్ధితో రూ.5,405 కోట్లకు చేరుకోగా, ఉత్తరప్రదేశ్ ఆదాయం 24 శాతం వృద్ధితో రూ.8,802 కోట్లకు చేరుకుంది. కాగా, మహారాష్ట్ర జీఎస్టీ వసూళ్లలో 18 శాతం వృద్ధితో రూ.26,024 కోట్లకు చేరుకుంది. కర్ణాటక జీఎస్టీ వసూళ్లలో 17 శాతం వృద్ధిని నమోదు చేసి రూ.11,505 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. తమిళనాడు జూలైలో రూ.10,022 కోట్ల జీఎస్టీ రాబడిని వసూలు చేసింది. ఇందులో 19 శాతం మెరుగుదల కనిపించింది. మరోవైపు, జూలైలో గుజరాత్‌లో కేవలం 7 శాతం ఆదాయం మాత్రమే పెరిగింది.

 


గతేడాది ఇదే నెలతో పోలిస్తే సేవల దిగుమతితో సహా దేశీయ లావాదేవీల ఆదాయంలో భారీగానే వృద్ధి నమోదైంది. జూలై 2023లో GST వసూళ్లు రూ.1,65,105 కోట్లు అంటే జూన్ 2023 కంటే ఎక్కువ. జూన్‌లో జీఎస్టీ వసూళ్లు రూ.1,61,497 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24 మొదటి నెలలో ఏప్రిల్ 2023లో జీఎస్టీ రికార్డు వసూళ్లు కనిపించగా, ఏప్రిల్ 2023లో జీఎస్టీ వసూళ్లు రూ. 1,87,035 కోట్లు. ఆన్‌లైన్ గేమింగ్‌కు సంబంధించిన చట్టంపై చర్చించేందుకు ఆగస్టు 2న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా జరగనుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి