
వాహన రిజిస్ట్రేషన్, పునరుద్ధరణ, యాజమాన్య బదిలీ, డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తులు, ఇతర పర్మిట్లు వంటి ఆన్లైన్ సేవలకు అంతరాయం లేకుండా ఉండేందుకు దేశ వ్యాప్తంగా ఉన్న అందరూ వాహనదారులు, డ్రైవింగ్ లైసెన్స్ హోల్డర్లు అధికారిక వాహన్ (Vahan) లేదా సారథి (Sarathi) పోర్టల్లలో తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను వెంటనే అప్డేట్ చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రవాణా రంగం డిజిటల్ ప్లాట్ఫామ్లకు మారుతున్న నేపథ్యంలో తాజాగా మొబైల్ నెంబర్స్ ఉండడం చాలా ముఖ్యమని తెలిపింది.
ఒక వేళ మీరు మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోకపోతే OTP దృవీకరణను పొందలేరని పేర్కొంది. ఇది లక్షలాది మంది పౌరులకు ఇబ్బంది కలిగిస్తుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. చాలా మంది యూజర్లు సంవత్సరాల గతంలో రిజిస్టర్ చేసిన పాత నంబర్లతో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని.. అవి ఇకపై యాక్టివ్గా లేదా ఉపయోగంలో ఉండకపోవచ్చునని మంత్రిత్వ శాఖ హైలైట్ చేసింది. ఈ నంబర్ను అప్డేట్ చేయడం వల్ల వ్యక్తిగత లావాదేవీలు సులభతరం కావడమే కాకుండా, జాతీయ రవాణా డేటాబేస్ భద్రత పెరుగుతుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
మొబైల్ నంబర్ అప్డేట్ ఎలా చేయాలి?
డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారి కోసం సారథి పోర్టల్లో మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి.
ఈ ప్రక్రియ ఆన్లైన్లోనే పూర్తవుతుంది, RTOకు వెళ్లాల్సిన అవసరం లేదు. వెంటనే అప్డేట్ చేసుకోవడం మంచిది, లేకపోతే ఆన్లైన్ సేవల్లో అంతరాయాలు ఎదుర్కొనవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.