Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pension: కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?

భారత ప్రభుత్వం ఈ పీఎం శ్రామ్ యోగి మంధన్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ నగరంలోని ఏదైనా సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఆపరేటర్ తన ఆధార్..

Pension: కార్మికులకు కేంద్ర ప్రభుత్వం పెన్షన్‌.. దరఖాస్తు చేసుకోవడం ఎలా?
Follow us
Subhash Goud

|

Updated on: Nov 03, 2024 | 5:41 PM

కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల కోసం అనేక పథకాలను అమలు చేస్తోంది. దేశంలోని కోట్లాది మంది ప్రజలు ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్నారు. వివిధ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పథకాలను తీసుకువస్తుంది. ఈ పథకాలు చాలా వరకు పేద ప్రజల కోసమే. దేశంలో పెద్ద సంఖ్యలో కార్మికులు ఉన్నారు. వారి అవసరాలను తీర్చుకోవడానికి రోజువారీ కూలీగా పని చేస్తున్నవారు చాలా మంది ఉన్నారు. చాలా మంది చాలా చిన్న ఉద్యోగాలు చేస్తారు. ఈ కూలీల ఆదాయం స్థిరంగా ఉండదు. అలాగే వారికి ఎలాంటి పెన్షన్‌ కూడా అందదు. అలాంటి కూలీల కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని కూడా ప్రారంభించింది. దీని కింద ప్రభుత్వం కార్మికులకు పెన్షన్ ఏర్పాటు చేస్తుంది. ఈ స్కీమ్ కోసం కార్మికులు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చో చూద్దాం.

కార్మికులకు ప్రతి నెలా పింఛన్:

భారత ప్రభుత్వం ముఖ్యంగా దేశంలోని పేద వర్గాల కోసం అనేక పథకాలను అమలు చేస్తుంది. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి శ్రమ యోగి మంధన్ యోజనను ప్రారంభించింది. ప్రభుత్వం 2019లో ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం కింద భారత ప్రభుత్వం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు నెలకు 3000 రూపాయల పెన్షన్‌ను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: Aadhaar Card: ఆధార్‌ కార్డులో మొబైల్‌ నంబర్‌ను ఎన్నిసార్లు అప్‌డేట్‌ చేయవచ్చో తెలుసా?

ప్రభుత్వం 18 నుంచి 40 ఏళ్లలోపు కార్మికులకు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ పథకంలో కనీసం 20 సంవత్సరాల పాటు కొత్త మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకానికి కూలీలు ఎంతగానో సహకరిస్తారో ప్రభుత్వం కూడా అంతే సహకారం అందజేస్తుంది.

పథకం కోసం ఎక్కడ దరఖాస్తు చేయాలి?

భారత ప్రభుత్వం ఈ పీఎం శ్రామ్ యోగి మంధన్ పెన్షన్ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులు తమ నగరంలోని ఏదైనా సమీపంలోని పబ్లిక్ సర్వీస్ సెంటర్‌కు వెళ్లవచ్చు. ఆపరేటర్ తన ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ సమాచారాన్ని అందించాలి. పథకాన్ని పొందేందుకు మీ మొబైల్ నంబర్‌ను మీ బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి. దీని కోసం మీరు ప్రీమియం మొదటి విడత నగదు రూపంలో చెల్లించాలి. మీరు చెక్కు లేదా నగదు ద్వారా డిపాజిట్ చేయవచ్చు. దీని తర్వాత ప్రీమియం మొత్తం మీ ఖాతా నుండి ఆటోమేటిక్‌గా డెబిట్ చేయబడుతుంది. మీకు 60 వచ్చిన తర్వాత ప్రభుత్వం నుంచి పెన్షన్‌ అందుతుంది.

ఇది కూడా చదవండి: UPI Services: ఈ నెలలో రెండు రోజులు యూపీఐ సేవలు బంద్‌.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి