Google: భారత్‌పై గూగుల్‌ ప్రత్యేక దృష్టి.. డిజిటల్‌ హబ్‌గా మార్చేందుకు భారీ పెట్టుబడులు

|

Feb 05, 2022 | 11:13 AM

Google: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ఓ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు..

Google: భారత్‌పై గూగుల్‌ ప్రత్యేక దృష్టి.. డిజిటల్‌ హబ్‌గా మార్చేందుకు భారీ పెట్టుబడులు
Follow us on

Google: గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ (Google CEO Sundar Pichai) ఓ కీలక ప్రకటన చేశారు. భారత్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. దీంతో రాబోయే కాలంలో భారతదేశం పెద్ద డిజిటల్ హబ్‌ (Digital Hub)గా మారబోతోంది. భారతదేశం (India) నుండి ప్రపంచ అవసరాలు తీరుతాయి . డిజిటల్ ఇండియా (Digital India)లో గూగుల్ (Google)పెట్టుబడులను కొనసాగించనున్నట్లు పిచాయ్ ప్రకటించారు. భారతదేశంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా డిజిటల్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు గూగుల్ కృషి చేస్తుంది . తమ కంపెనీ ఇలాంటి ఉత్పత్తులను భారత్‌లో మరిన్ని తయారు చేస్తుందని, ఇది ప్రపంచ స్థాయిలో తనకు సహాయపడుతుందని గూగుల్ సీఈఓ తెలిపారు. భారతదేశంలో డిజిటలైజేషన్ కోసం కంపెనీ గత సంవత్సరం USD 10 బిలియన్ల (సుమారు రూ. 75,000 కోట్లు) పెట్టుబడిని ప్రకటించింది.

భారతదేశంలో యూట్యూబ్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలని పిచాయ్ ప్రకటించారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా కంపెనీకి YouTube షార్ట్‌లు చాలా ముఖ్యమైనవి. యూట్యూబ్‌ భారతదేశంలో ఇప్పటివరకు 5 ట్రిలియన్ల ఆల్-టైమ్ వీక్షణలను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా రోజుకు 15 బిలియన్ల కంటే ఎక్కువ వీక్షణలను పొందుతోంది.

2022లో గూగుల్ సెర్చ్, గూగుల్ మ్యాప్, యూట్యూబ్‌లో కొత్త ఫీచర్లను చేర్చనున్నట్లు పిచాయ్ తెలిపారు. వీటిని ప్రజలకు మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దనున్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా మిగిలిన దేశాలకు సహాయపడుతుంది. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో గూగుల్ మరింత ఎక్కువ పెట్టుబడి పెట్టనుంది. తద్వారా దేశంలో ఎక్కువ మంది ప్రజలు ఇంటర్నెట్‌ను సులభంగా యాక్సెస్ చేయగలరు.

5Gకి సంబంధించి ఇటీవల గూగుల్, భారతీ ఎయిర్‌టెల్ చేతులు కలిపిన విషయం తెలిసిందే. భారతీయ టెలికాం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్‌లో గూగుల్ 100 మిలియన్ డాలర్లు (రూ. 7510 కోట్లు) పెట్టుబడి పెట్టనుంది. ఇందులో, Google, భారతీ ఎయిర్‌టెల్‌లో $ 700 మిలియన్ (రూ. 5257 కోట్లు) వాటాను కొనుగోలు చేస్తుంది. వీరు కలిసి చౌక ఫోన్‌లను అభివృద్ధి చేయనున్నారు. భారతీ ఎయిర్‌టెల్‌లో 1.28 శాతం వాటాను ఒక్కో షేరుకు రూ.734 చొప్పున గూగుల్ కొనుగోలు చేయనుంది. ఇది కాకుండా, మిగిలిన 300 మిలియన్ డాలర్లు (రూ. 2253 వేల కోట్లు) కొన్నేళ్లపాటు వాణిజ్య ఒప్పందాల రూపంలో పెట్టుబడి పెడతారు.

 

ఇవి కూడా చదవండి:

PM KISAN Samman Nidhi Yojana: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్‌ డబ్బులు ఎప్పుడు వస్తాయంటే..!

Edible Oils: వంట నూనె నిల్వలపై పరిమితులు పెంపు.. ధరలు మరింతగా తగ్గించేందుకు కేంద్రం చర్యలు