
Gold Price: ప్రపంచ రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న తాజా పరిణామాలు సామాన్యుల జేబుకు చిల్లు పెట్టబోతున్నాయా? అంటే అవుననే అంటున్నారు ఆర్థిక నిపుణులు. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం అంతర్జాతీయ మార్కెట్లను వణికిస్తోంది. పసిడి, వెండి ధరలను రికార్డు స్థాయిలో పెరిగేలా కనిపిస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరలు రాబోయే రోజుల్లో ఊహించని స్థాయికి పెరుగుతాయని, బంగారం ధర తులం (10 గ్రాములు) ఏకంగా రూ. 2 లక్షలు దాటే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే వెండి కూడా రికార్డ్ స్థాయిలో దూసుకుపోయే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం తులం బంగారం ధర రూ.1,73,080 ఉండగా, కిలో వెండి ధర రూ.2,95,000 వద్ద ఉంది. అదే హైదరాబాద్లో మాత్రం ఇంకా భారీగా ఉంది. కిలో వెండి ధర రూ.3,25,000 వద్ద ట్రేడవుతోంది.
ప్రపంచవ్యాప్తంగా విలువైన లోహాల మార్కెట్లు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. శనివారం ఇరాన్పై ఇజ్రాయెల్ – అమెరికా సమన్వయంతో చేసిన దాడులు పెట్టుబడిదారుల ఆందోళనలను రేకెత్తించాయి. ఈ సంఘటన తర్వాత ప్రజలు తమ డబ్బును కాపాడుకోవడానికి బంగారం, వెండి వంటి సాంప్రదాయ వస్తువుల వైపు మొగ్గు చూపుతున్నారు.
అమెరికా – ఇరాన్ మధ్య యుద్ధం గురించి పెరుగుతున్న చర్చ ఆర్థిక మార్కెట్లలో భయాందోళనలను సృష్టించవచ్చని విశ్లేషకులు అంటున్నారు. అటువంటి సమయాల్లో ప్రజలు బంగారం, వెండిని సురక్షితమైన పెట్టుబడులుగా భావిస్తారు.
ప్రపంచంలో యుద్ధం జరుగుతుందనే సంకేతాలు వచ్చినప్పుడల్లా, బంగారం, వెండి ధరలు మొదట పెరగడం తరచుగా గమనించవచ్చు. అందుకే ఇరాన్పై ఇజ్రాయెల్-అమెరికన్ ఉమ్మడి దాడి తర్వాత బంగారం, వెండి ధరలు గణనీయంగా పెరగవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. అయితే బంగారం, వెండి ధరల పెరుగుదల వెనుక ఇతర అంశాలు కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: మీరు హైవేపై కారులో రయ్యుమంటూ స్పీడ్గా వెళ్తున్నారా? ఇది తెలుసుకోవాల్సిందే!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి