Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?

Gold and Silver Latest Prices: బంగారం కొనాలనుకునేవారికి షాక్‌.. దీపావళి పండగ సందర్భంగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ ఇప్పుడు కొండెక్కుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం (నవంబర్‌ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది.

Gold Price Today: మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ఎంత ఉందంటే?
Gold Price Today

Updated on: Nov 16, 2023 | 6:31 AM

Gold and Silver Latest Prices: బంగారం కొనాలనుకునేవారికి షాక్‌.. దీపావళి పండగ సందర్భంగా పడిపోయిన పసిడి ధరలు మళ్లీ ఇప్పుడు కొండెక్కుతున్నాయి. వరుసగా రెండో రోజు బంగారం ధర భారీగా పెరిగింది. గురువారం (నవంబర్‌ 16) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.400 పెరగ్గా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 440 రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం బులియన్‌ మార్కెట్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,950 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.61,040 లుగా ఉంది. ఇక వెండి ధరలు కూడా బంగారం బాటలోనే పయనించాయి. వెండి కిలో ధర రూ.1700 మేర పెరిగి .. 74,700 లుగా కొనసాగుతోంది. మరి దేశంలోని ప్రధాన నగరాలు, తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం రేట్లు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55, 950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 పలుకుతోంది.

ప్రధాన నగరాల్లో బంగారం ధరలు..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.56,100 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.61,190 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్లు రూ.61,040, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,450, 24 క్యారెట్ల ధర రూ.61,580, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.55,950, 24 క్యారెట్ల ధర రూ.61,040 గా ఉంది.

ఇవి కూడా చదవండి

వెండి ధరలిలా..

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.74,700 గా ఉంది. ముంబైలో రూ.74,700 ఉండగా.. చెన్నైలో రూ.77,700, బెంగళూరులో రూ.71,500గా ఉంది.. కేరళలో రూ.77,700, కోల్‌కతాలో రూ.74,700 లుగా ఉంది. ఇక హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.77,700 పలుకుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరకు వెండి లభిస్తోంది.

గమనిక.. బంగారం, వెండి ధరలు బులియన్ మార్కెట్ వెబ్‌సైట్‌లలో ఉదయం 6 గంటల వరకు నమోదైనవి.. అయితే, ఈ ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు, చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది.. కావున, కొనేముందు ఒకసారి బంగారం, వెండి ధరలను పరిశీలించి వెళ్లడం మంచిది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..