Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంత తగ్గిందంటే..!

|

Jun 17, 2021 | 6:01 AM

Gold Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం..

Gold Price Today: బంగారం ప్రియులకు శుభవార్త.. దిగివస్తున్న పసిడి ధరలు.. ఈ రోజు ఎంత తగ్గిందంటే..!
Follow us on

Gold Price Today: దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభించి ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ఈ తరుణంలో కూడా పసిడి ధరలు మాత్రం పెరుగుతుండగా, ప్రస్తుతం తగ్గుముఖం పడుతోంది. తాజాగా గురువారం పసిడి ధరలు దిగి వచ్చాయి. బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. ఒక రోజు ధరలు తగ్గితే.. మరొకరోజు పెరుగుతుంటాయి. అందుకే బంగారం కొనుగోలు చేసే వారంతా ఆసక్తితో బులియన్ మార్కెట్ వైపు దృష్టి పెడుతుంటారు. అయితే.. తాజాగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పడుతున్నాయి. గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.190 మేర తగ్గింది. దేశీయంగా పరిశీలిస్తే ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 వద్ద కొనసాగుతోంది. ఇక తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.51,600 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.45,750 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,900 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,410 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,410 ఉంది. అలాగే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,840 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,450 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో..

అలాగే హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,350 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,470 ఉంది.

అయితే గురువారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. అయితే బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అంతేకాదు.. ప్రస్తుతం 50 వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

Online Jewelry: మీరు ఆన్‌లైన్‌లో నగలు కొంటున్నారా..? అయితే వీటిని గుర్తించుకోవడం మంచిది.. లేకపోతే మోసమే..!

Jan Dhan Yojana: మీకు జన్‌ధన్‌ ఖాతా ఉందా..? రూ.2 లక్షల వరకు ఉచిత బీమా సౌకర్యం.. క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా..?