Gold Price Today: దేశీయంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది.. ఎంతంటే..!

Gold Price Today: బంగారం పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గుముఖం పట్టగా, మరొక రోజు పెరుగుతోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే..

Gold Price Today: దేశీయంగా స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తగ్గింది.. ఎంతంటే..!
Gold Price Today

Updated on: Jun 11, 2021 | 6:14 AM

Gold Price Today: బంగారం పరుగులు పెడుతోంది. ఒక రోజు తగ్గుముఖం పట్టగా, మరొక రోజు పెరుగుతోంది. రోజురోజుకు ఆగకుండా పరుగులు పెడుతోంది. తాజాగా దేశీయంగా పరిశీలిస్తే 10 గ్రాముల ధర పై స్వల్పంగా అంటే రూ200 మేర పెరిగింది. కానీ హైదరాబాద్‌లో పాటు, హైదరాబాద్‌, బెంగళూరు ఇతర ప్రధాన నగరాల్లో తగ్గుముఖం పట్టింది. అంటే రూ.100 నుంచి రూ.150 వరకు తగ్గింది. తాజాగా శుక్రవారం దేశంలోని ప్రధాన నగరాల్లో నమోదైన ధరల వివరాలు ఇలా ఉన్నాయి

దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,950 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.52,300గా ఉంది. ఇక చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.46,150 ఉండగా, 24 క్యారెట్ల10 గ్రాముల ధర రూన.50,350 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.47,880 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,880 వద్ద కొనసాగుతోంది. ఇక కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.48,200 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,900 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉండగా, విజయవాడలో రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.

అయితే శుక్రవారం ఉదయం ఉన్న ధరలు ఇవి. ధరల్లో ప్రతి రోజు మార్పులు చేర్పులు జరుగుతూనే ఉన్నాయి. మే నెలలో పరుగులు పెట్టి కాస్త తగ్గుముఖం పట్టగా, ఇప్పుడు మళ్లీ పై చూపులు చూస్తోంది. బంగారం ధరలు పెరగడానికి ఎన్నో కారణాలున్నాయంటున్నారు బులియన్‌ మార్కెట్‌ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని వెల్లడిస్తున్నారు. బంగారం కొనుగోలు చేసే వారు ఆ సమయంలో ధర ఎంత ఉందో తెలుసుకొని వెళ్లడం బెటర్‌. అంతేకాదు.. ప్రస్తుతం 50 వేలకుపైగా చేరిన పసిడి.. మున్ముందు మరింత పెరిగే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు.

ఇవీ కూడా చదవండి:

SBI ATM:ఎస్‌బీఐ కస్టమర్లకు గుడ్‌న్యూస్‌.. గడువు ముగిసినా, కొత్త ఏటీఎం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండిలా..!

ATM Transaction: ఇక బాదుడే.. బాదుడు.. బ్యాంకు కస్టమర్లకు షాక్‌.. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం

Follow Us