Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర. తులం ఎంతుందంటే..

|

Jun 11, 2024 | 6:25 AM

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఓ రేంజ్‌లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 80 వేలకు చేరి, రూ. లక్షకు చేరుకుంటుందని వార్తలు వచ్చిన..

Gold Price Today: గోల్డెన్‌ న్యూస్‌.. తగ్గిన బంగారం ధర. తులం ఎంతుందంటే..
Gold Price
Follow us on

మొన్నటి వరకు ఆకాశమే హద్దుగా ఓ రేంజ్‌లో పెరిగిన బంగారం ధరలు ఇప్పుడు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. మరీ ముఖ్యంగా గడిచిన వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా కొనసాగడం లేదా తగ్గుముఖం పట్టడం స్పష్టంగా కనిపిస్తోంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల బంగారం ధర ఏకంగా రూ. 80 వేలకు చేరి, రూ. లక్షకు చేరుకుంటుందని వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా నమోదవుతోన్న ధరలు కొనుగోలు దారులకు కాస్త ఊరటనిస్తోంది. తాజాగా మంగళవారం కూడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరి ఈరోజు దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

* దేశ రాజధాని న్యూఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,840గా ఉండగా 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,810వద్ద కొనసాగుతోంది.

* ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660 వద్ద కొనసాఉగతోంది.

* చెన్నైలో మంగళవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం రూ. 66,290కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 72,320గా ఉంది.

* బెంగళూరు విషయానికొస్తే ఇక్కడ 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.71,660 వద్ద కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు..

* హైదరాబాద్‌లో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

* విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 65,690గా ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 71,660 వద్ద కొనసాగుతోంది.

* విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 65,690కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 71,660గా ఉంది.

వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం ధరలో తగ్గుదల కనిపిస్తే వెండి మాత్రం దూసుకుపోతోంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కిలో వెండి ధర ఏకంగా రూ. లక్షకు చేరువలో ఉంది. మంగళవారం ఢిల్లీతోపాటు ముంబయి, కోల్‌కతా, పుణెలో కిలో వెండి ధర రూ. 91,800 వద్ద కొనసాగుతోంది. అదే విధంగా చెన్నైతో పాటు, కేరళ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖలో కిలో వెండి ధర అత్యధికంగా రూ. 96,300గా ఉంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..