Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..

|

Jan 27, 2025 | 6:24 AM

గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మరింత దూకుడుతో ధరలు పెరుగుతున్నాయి.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.82 వేల మార్క్ దాటింది.. అయితే.. మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.. ఈ క్రమంలో తాజాగా బంగారం, వెండి ధర స్వల్పంగా తగ్గింది.

Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. తగ్గిన బంగారం, వెండి ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో..
Gold Silver Price
Follow us on

బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం.. పసిడి, వెండి ధరల్లో ప్రతిరోజూ మార్పులు, చేర్పులు జరుగుతూ ఉంటాయి.. ఒక్కోసారి ధరలు తగ్గితే మరికొన్ని సార్లు పెరుగుతుంటాయి.. అయితే.. గత కొంత కాలం నుంచి బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి.. కొత్త ఏడాది ప్రారంభం నుంచి మరింత దూకుడుతో ధరలు పెరుగుతున్నాయి.. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ.82 వేల మార్క్ దాటింది.. అయితే.. మరింత పెరిగే అవకాశం ఉందని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు..

అయితే.. తాజాగా గోల్డ్, సిల్వర్ ధరలు స్వల్పంగా తగ్గాయి.. సోమవారం (27 జనవరి 2025) ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,540, 24 క్యారెట్ల ధర రూ.82,410 గా ఉంది. వెండి కిలో ధర రూ.97,400 లుగా ఉంది. తులం బంగారంపై రూ.10 మేర, కిలో వెండిపై రూ.100 మేర తగ్గింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఈ కింద చూడండి..

బంగారం ధరలు..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,540, 24 క్యారెట్ల ధర రూ.82,410 గా ఉంది.

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.75,540, 24 క్యారెట్ల ధర రూ.82,410 గా ఉంది.

ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.75,690, 24 క్యారెట్ల ధర రూ.82,560 గా ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.75,540, 24 క్యారెట్ల ధర రూ.82,410 గా ఉంది.

చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.75,540, 24 క్యారెట్లు రూ.82,410 లుగా ఉంది.

బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.75,540, 24 క్యారెట్ల ధర రూ.82,410 గా ఉంది.

వెండి ధరలు..

హైదరాబాద్‌‌లో కిలో వెండి ధర రూ.1,04,900

విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,04,900 గా ఉంది.

ఢిల్లీలో వెండి కిలో ధర రూ.97,400 లుగా ఉంది.

ముంబైలో రూ.97,400

బెంగళూరులో రూ.97,400

చెన్నైలో రూ.1,04,900 లుగా ఉంది.

కాగా, ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవిగా గమనించగలరు. ఒకవేళ మీకు బంగారం, వెండి ధరల లేటెస్ట్ అప్‌డేట్ గురించి తెలియాలంటే ఈ మొబైల్ నెంబర్‌కు 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..