Gold And Silver Price: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..

బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరిగింది. కిలో వెండి ధర రూ.1500 రూపాయలు పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,650 రూపాయలు ఉండగా ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల ధర రూ.72,710లుగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

Gold And Silver Price: పసిడి ప్రియులకు షాక్.. స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధర.. ప్రధాన నగరాల్లో ఎలా ఉన్నాయంటే..
Gold And Silver Price

Updated on: May 28, 2024 | 6:33 AM

కొన్ని రోజుల క్రితం ఆల్ టైం హాయ్ కి వెళ్ళిన బంగారం ధర గత వారం స్వల్పంగా తగ్గింది. దీంతో బంగారం ధర క్రమంగా అదుపులోకి వస్తుందేమో అని ఆశపడిన పసిడి ప్రియులకు షాక్ ఇస్తూ మళ్ళీ బంగారం, వెండి ధరలు పెరిగాయి. బంగారం ధర 10 గ్రాములకు రూ.250 పెరిగింది. కిలో వెండి ధర రూ.1500 రూపాయలు పెరిగింది. దీంతో భారతదేశంలో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 66,650 రూపాయలు ఉండగా ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్ల ధర రూ.72,710లుగా కొనసాగుతుంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం..

భారతదేశంలో ప్రధాన నగరాల్లో మే 28 నాటికి బంగారం ధరలు

హైదరాబాద్​లో ప్రస్తుతం 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 66,660గా ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర రూ. 72,720గా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

వివిధ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు).

ఇవి కూడా చదవండి
  1. బెంగళూరు: రూ.66,650
  2. చెన్నై: రూ.67,200
  3. ముంబై: రూ.66,650
  4. ఢిల్లీ: రూ.66,800
  5. కోల్‌కతా: రూ.66,650
  6. కేరళ: రూ. 66,650

వివిధ నగరాల్లో 24 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములకు).

  1. బెంగళూరు 24 క్యారెట్ల గోల్డ్​.. 72,720
  2. చెన్నైలో 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,320
  3. ముంబై, 24 క్యారెట్ల గోల్డ్​.. 72,720
  4. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 72,870
  5. కోల్​కతాలో 24 క్యారెట్ల గోల్డ్​.. 72,720
  6. కేరళలో 24 క్యారెట్ల గోల్డ్​.. 72,720

దేశంలో ప్రధాన నగరాల్లో వెండి ధరలు

వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. కిలో వెండి ధర రూ.1500 రూపాయలు పెరిగింది. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 97,600 పలుకుతోంది. కోల్​కతాలో రూ.​ 93,100, బెంగళూరులో రూ. 93,350గా ఉంది.

అమెరికాలో బ్యాంకు వడ్డీ రేటు పెరగవచ్చన్న భయం ఈ బంగారం ధర తగ్గడానికి కారణమైంది. నిపుణుల అంచనాల ప్రకారం బంగారం ధర ఇప్పుడు తగ్గుతోంది. అయితే రాబోయే రోజుల్లో బంగారం ధరలు మళ్లీ పెరుగవచ్చు. ఈ ఏడాది (2024 చివరి నాటికి) బంగారం ధర రూ.70,000 దాటవచ్చని చెబుతున్నారు.

(గమనిక: ఇక్కడ ఇవ్వబడిన బంగారం, వెండి ధరలు ఖచ్చితమైనవని హామీ ఇవ్వలేము. ఇది ప్రముఖ ఆభరణాల నుంచి సేకరించిన సమాచారం. అలాగే ఈ ధరలు GST, మేకింగ్ ఛార్జీలు మొదలైన వాటికి లోబడి ఉండవచ్చు.)

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us