భారతదేశంలో వేతన జీవుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అధిక జనాభా కారణంగా ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు చేసే వారు అధికంగా ఉంటారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ద్వారా ఉద్యోగితో పాటు యాజమాన్యం సమాన వాటాలతో పొదుపు చేస్తుంది. అయితే ఇందులో కొంత మొత్తం పెన్షన్ పథకాన్ని జమ చేయగా మిగిలిన మొత్తాన్ని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే ఆర్థిక అత్యవసర సమయంలో ఈ సొమ్ము విత్డ్రా చేసుకోవచ్చని చాలా మందికి తెలుసు. కానీ అప్లికేషన్ ప్రాసెస్ గురించి భయపడి వెనకడుగు వేస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఆన్లైన్ ద్వారా పీఎఫ్ విత్ డ్రా ఆప్షన్ అందుబాటులో ఉంది. అలాగే కొన్ని యాప్స్ ద్వారా కూడా పీఎఫ్ విత్డ్రా చేసుకునే సదుపాయం ఉంది. ఈ నేపథ్యంలో పీఎఫ్ విత్ డ్రా గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
మీరు అత్యవసర పరిస్థితుల్లో చికిత్స పొందాలనుకుంటే పీఎఫ్ ఉపసంహరణ వేగంగా అందిస్తారు. అలాగే మీరు పిల్లలను చదివేందుకు పీఎఫ్ను కూడా విత్డ్రా చేసుకోవచ్చు. మీ సోదరుడు-సోదరి లేదా కొడుకు, కుమార్తె వివాహంం కోసం పీఎఫ్ ఖాతా నుండి డబ్బును కూడా విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మీరు ఇంటిని కొనుగోలు చేయడానికి లేదా ఇంటిని మరమ్మతులు చేయడానికి నిధులను ఉపసంహరించుకోవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..