Nirmala Sitharaman: ద్రవ్యోల్బణ ప్రభావం భారత్‌పై ఉండదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Finance Minister Nirmala Sitharaman: ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావం భారత్‌పై ఉండదన్నారు. అక్టోబర్ వరకు ద్రవ్యోల్బణంపై..

Nirmala Sitharaman: ద్రవ్యోల్బణ ప్రభావం భారత్‌పై ఉండదు.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
Finance Minister Nirmala Si

Updated on: Jul 12, 2022 | 9:45 PM

వినియోగదారుల ధరల సూచీ ఆధారంగా ద్రవ్యోల్బణం అధిక స్థాయిలో ఉన్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ద్రవ్యోల్బణ ప్రభావం భారత్‌పై ఉండదన్నారు. అక్టోబర్ వరకు ద్రవ్యోల్బణంపై అవగాహన అవసరమని నిర్మలా సీతారామన్ అన్నారు. అదే సమయంలో, ప్రతి వస్తువు ధరలను పర్యవేక్షించడానికి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఖచ్చితమైన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థం ప్రారంభం నాటికి కేంద్ర బ్యాంకు, ప్రభుత్వం రెండూ అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ, “ధరలు ఎలా మారుతున్నాయో మనం అప్రమత్తంగా.. జాగ్రత్తగా ఉండాలి. వస్తువు ధరలపై నిఘా పెంచాము. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఖచ్చితమైన చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.

“ఇటీవలి UNDP నివేదిక “అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవన వ్యయ సంక్షోభాన్ని పరిష్కరించడం” భారతదేశంలోని పేదరికంపై ద్రవ్యోల్బణం చాలా తక్కువ ప్రభావాన్ని చూపుతుందని చూపిస్తుంది, లక్ష్య బదిలీలు (భారతదేశం చేస్తున్నది వంటివి) పేద కుటుంబాలు ధరలను ఎదుర్కోవటానికి సహాయపడతాయి.”

దీంతో పాటు ఈ ఏడాది రుతుపవనాలు అనుకూలించడంతో ఉత్పత్తి బాగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి డిమాండ్ కూడా పెరుగుతుందన్నారు. జూన్ నెల రిటైల్ ద్రవ్యోల్బణం డేటా తర్వాత నిర్మలా సీతారామన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

బిజినెస్ న్యూస్ కోసం..