EPFO: పీఎఫ్‌ కస్టమర్లు ఈ పని పూర్తి చేశారా..? లేదంటే రూ.7 లక్షలు కోల్పోయినట్లే..

|

Aug 16, 2022 | 5:01 PM

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు రూ.7 లక్షల ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే దీని కోసం ఒక ముఖ్యమైన పని చేయాల్సి..

EPFO: పీఎఫ్‌ కస్టమర్లు ఈ పని పూర్తి చేశారా..? లేదంటే రూ.7 లక్షలు కోల్పోయినట్లే..
EPFO
Follow us on

EPFO: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తన కస్టమర్లకు రూ.7 లక్షల ప్రయోజనాన్ని అందిస్తోంది. అయితే దీని కోసం ఒక ముఖ్యమైన పని చేయాల్సి ఉంటుంది. అదే ఈ-నామినేషన్ దాఖలుకు సంబంధించినది. అంటే తన ఈపీఎఫ్ ఖాతాలో ఈ-నామినేషన్ ఫైల్ చేసిన కస్టమర్ రూ.7 లక్షల ప్రయోజనం పొందుతారు. ఈపీఎఫ్‌వో నోటీసులో ఈ సమాచారం ఇచ్చింది. ఈపీఎఫ్‌ కలిగివున్న ప్రతి ఒక్కరికి ఈ-నామినేషన్ తప్పనిసరి చేయబడింది. తద్వారా ఖాతాదారునికి ఏ విధమైన మరణం సంభవించినా ఆ సదుపాయాన్ని అతని నామినీ అందుకోవచ్చు. PFలో సామాజిక భద్రతకు సంబంధించిన ప్రయోజనం నామినీకి ఇవ్వబడుతుంది.

EPFO ఈ-నామినేషన్ సదుపాయం ఖాతాదారులందరికీ వర్తిస్తుంది. ఈ-నామినేషన్ మొత్తం డిజిటల్‌గా ఉండాలి. అందుకే ఏ కార్యాలయానికి వెళ్లాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉండి ఆన్‌లైన్‌ ద్వారా ఈ-నామినేషన్‌ ప్రక్రియను కొన్ని నిమిషాల్లోనే పూర్తి చేసుకోవచ్చు.

ఈ-నామినేషన్‌ను ఎలా చేయాలో తెలుసుకుందాం..

ఇవి కూడా చదవండి

☛ ముందుగా మీరు epfindia.gov.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.

☛ ఇక్కడ సర్వీసెస్ ట్యాబ్‌లోకి వెళ్లి, ఉద్యోగుల ఎంపికపై క్లిక్ చేయండి.

☛ ఇప్పుడు మెంబర్ UAN / ఆన్‌లైన్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

☛ దీని తర్వాత ఈ-సేవా పోర్టల్‌కి వెళ్లి మీ మొత్తం సమాచారాన్ని నమోదు చేయండి.

☛ ఇక్కడ మీరు మేనేజర్ ట్యాబ్‌ కనిపిస్తుంది. అక్కడ మీరు YES ఎంపికను ఎంచుకుని, కుటుంబ సమాచారాన్ని అప్‌డేట్ చేయాలి.

☛ మీ కుటుంబ సమాచారం మొత్తాన్ని పూరించండి

☛ ఇప్పుడు నామినేషన్ వివరాలపై క్లిక్ చేసి, ఎవరెవరికి ఎంత షేర్‌ అనేది నమోదు చేయాలి.

☛ దీని తర్వాత ఈపీఎఫ్ నామినేషన్ వివరాలను సేవ్ చేసుకోవాలి.

☛ e-Sign ఎంపికపై క్లిక్ చేసిన తర్వాత మీ మొబైల్‌కు వచ్చిన OTPని నమోదు చేయాలి.

☛ తర్వాత మీ ఈ-నామినేషన్‌ ప్రక్రియ పూర్తవుతుంది.

ఈ ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత వినియోగదారుని ఇ-నామినేషన్ పూర్తవుతుంది. ఒక సబ్‌స్క్రైబర్ ఇ-నామినేషన్ చేయకపోతే అతని నామినీ సామాజిక భద్రతకు సంబంధించిన ప్రయోజనాలను పొందడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొవచ్చు. ఇలా ఇబ్బందులు పడకుండా, ప్రయోజనం పొందేందుకు ఈ-నామినేషన్ తప్పనిసరి చేయబడింది. ఖాతాదారు చనిపోయినప్పుడు ఈ-నామినేషన్ ప్రయోజనం నామినీకి అందుబాటులో ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ-నామినేషన్ నమోదు చేసుకుంటే నామినీకి రూ.7 లక్షలు ఇస్తారు. కస్టమర్ తప్పనిసరిగా నామినీ పేరును నమోదు చేయాలి. కస్టమర్లు తమ మొబైల్ లేదా కంప్యూటర్ నుండి ఇంట్లో కూర్చొని ఈ-నామినేషన్ ఫైల్ చేయవచ్చు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి