Business: ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ కొరడా.. భారీ జరిమానాకు షోకాజ్ నోటీసులు

ఈ కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌పై భారీ జరిమానా విధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సిద్ధపడింది. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించిన..

Business: ఫ్లిప్‌కార్ట్‌పై ఈడీ కొరడా.. భారీ జరిమానాకు షోకాజ్ నోటీసులు
Walmart Flipkart

Updated on: Aug 05, 2021 | 10:25 AM

ఈ కామర్స్ సంస్థ వాల్‌మార్ట్ ఫ్లిప్‌కార్ట్‌పై భారీ జరిమానా విధించేందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సిద్ధపడింది. విదేశీ పెట్టుబడుల చట్టాలను ఉల్లంఘించిన కారణంగా 1.35 బిలియన్ డాలర్ల జరిమానా ఎందుకు విధించకకూడదో చెప్పాలంటూ ఆ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఫ్లిప్‌కార్ట్ ఫౌండర్లు సచిన్ బన్సల్, బిన్ని బన్సల్‌, ప్రస్తుత ఇన్వెస్టర్ టైగర్ గ్లోబల్‌లకు నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే అనేక నియంత్రణలు, యాంటీట్రష్ట్ దర్యాప్తులు ఎదుర్కొంటున్న ఫ్లిప్‌కార్ట్‌కు తాజా నోటీసులు మరో తలనొప్పి అనే చెప్పాలి. విదేశీ పెట్టుబడుల నిబంధనలను ఏళ్లుగా ఉల్లంఘిస్తుండడంపై ఈడీ ఎప్పటి నుంచో దర్యాప్తు చేస్తోంది. విదేశీ పెట్టుబడులు, డబ్ల్యూ‌ఎస్ రీటైల్‌‌లను ఆకర్షించిన ఫ్లిప్‌కార్ట్.. దాని వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభించిది. ఇది నిబంధనలకు విరుద్ధమని ఈడీ వాదిస్తోంది. దీనిపై ఎందుకు జరిమానా విధించకూడదో చెప్పాలంటూ గత నెలలో చెన్నై‌లోని ఫ్లిప్‌కార్ట్ ఆఫీసుకు నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన ఫ్లిప్‌కార్ట్ ప్రతినిధి.. తమ సంస్థ భారత చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉందని అన్నారు. దర్యాప్తు సంస్థకు తాము పూర్తిగా సహకరిస్తామని, 2009-15 కాలానికి సంబంధించి అంశాలపై నోటీసులు ఇచ్చిందన్నారు.

Also read: Silver Price Today: పెరిగిన వెండి ధరలు.. హైదరాబాద్‏లో 10 గ్రాముల సిల్వర్ ఎంతంటే..

Loading...
Unable to load recommendations.
Follow Us