స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్..పోలీసులకు ఫిర్యాదు

|

Sep 16, 2020 | 5:31 PM

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట భారీగా మోహరించిన స్విగ్గి డెలివరీ బాయ్స్ తమ ఆందోళన వ్యక్తం చేశారు.

స్విగ్గీపై గరమైన డెలివరీ బాయ్స్..పోలీసులకు ఫిర్యాదు
Follow us on

ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్విగ్గీ తమను మోసం చేస్తోందంటూ డెలివరీ బాయ్స్ పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మాదాపూర్ పోలీసు స్టేషన్ ఎదుట భారీగా మోహరించిన స్విగ్గి డెలివరీ బాయ్స్ తమ ఆందోళన వ్యక్తం చేశారు. స్విగ్గి కంపెనీ యాజమాన్యం.. తమకు కమిషన్ తక్కువగా ఇస్తుందని ఆందోళన చేపట్టారు. గతంలో 2 కిలోమీటర్ల పరిధిలోపు ఒక డెలివరీ ఐటెమ్ కు 35 రూపాయల కమిషన్ ఇచ్చిన స్విగ్గీ ప్రస్తుతం ఒక కిలోమీటర్ పరిధిలోపు డెలివరీ చేస్తే కేవలం 6 రూపాయలు మాత్రమే ఇస్తుందని ఆరోపించారు.

స్విగ్గీ కంపెనీ యాజమాన్యం థర్డ్ పార్టీ ని పెట్టి తమ పొట్ట కొడుతుందని, దీంతో రోజుకి 200 సంపాదించలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. థర్డ్ పార్టీకి ఎక్కువ కమిషన్ ఇస్తూ తమకు మాత్రం తక్కువ కమిషన్ ఇస్తుందని స్విగ్గీ డెలివరీ బాధితులు చెబుతున్నారు. తమను మోసం చేస్తున్న స్విగ్గీ కంపెనీ పై మాదాపూర్ పోలీసు స్టేషన్ లో వారు ఫిర్యాదు చేశారు. స్టేషన్ కు వచ్చిన స్విగ్గీ ప్రతినిధులు రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో సమస్యలు పరిష్కారం కాకుంటే హైదరాబాద్ మొత్తం ఆందోళనలు చేస్తామని స్విగ్గీ డెలివరీ బాయ్స్ హెచ్చరికలు జారీ చేశారు…