
Fraud Alert: దేశంలో డీలిమిటేషన్ ప్రక్రియలో భాగంగా జనాభా లెక్కల సేకరణ ప్రారంభం కానుంది. దీనిని అదనుగా చేసుకుని కొంతమంది కేటుగాళ్లు ‘జనాభా లెక్కల అధికారులం’ అంటూ ఇళ్లపై పడి ప్రజలను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి వారి పట్ల ఎలా వ్యవహరించాలో తెలుసుకుందాం..
మీ ఇంటికి ఎవరైనా జనాభా లెక్కల కోసం వస్తే పాటించాల్సిన జాగ్రత్తలు:
అపరిచితులను ఇంట్లోకి రానివ్వకండి: వారు ఎవరో, నిజమైన అధికారులో కాదో తెలిసే వరకు వారిని ఇంటి బయటనే ఉంచి మాట్లాడండి. ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేయకండి
ఏ వివరాలు అడుగుతారు?: ప్రభుత్వం పంపిన అసలైన అధికారులు సాధారణంగా మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? తాగునీటి సదుపాయం ఏంటి? మీరు ఉంటున్నది సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా? మీ ఇంట్లో టీవీ, లాప్టాప్ వంటి వస్తువులు ఉన్నాయా? వంటి ప్రాథమిక సమాచారాన్ని మాత్రమే అడుగుతారు.
ఏ వివరాలు అస్సలు ఇవ్వకూడదు?:
మోసగాళ్లు వస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలి?
మీ ఏరియాలో లేదా మీ ఇంటికి ఇలాంటి అనుమానిత వ్యక్తులు వస్తే వెంటనే ఈ కింది నంబర్లకు సమాచారం అందించండి:
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి