సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవాలనే ఆలోచనలో ప్రతీ ఒక్కరూ ఉంటారు. ఇందుకోసం ఒక్కొక్కరు ఒక్కో మార్గాన్ని ఎంచుకుంటారు. కొందరు చిట్టిలు వేస్తుంటే, మరికొందరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అయితే ఇవి కాస్త రిస్క్తో కూడకున్న అంశంగా చెప్పొచ్చు. మరి అలా కాకుండా ఎలాంటి రిస్క్ లేకుండా మంచి రిటర్న్స్ పొందే అవకాశం ఉంటే బాగుంటుంది కదూ! ఇలాంటి ఓ పథకం గురించే ఈ రోజు తెలుసుకుందాం.
ప్రముఖ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ పోస్టాఫీస్ పెట్టుబడి పథకాలను అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తక్కువ రిస్క్తో మంచి రిటర్న్స్ పొందే బెస్ట్ స్కీమ్ అందుబాటులో ఉంది. ఇంతకీ ఆ స్కీమ్ ఏంటి.? ఇందులో ఎంత పెట్టుబడి పెడితే ఎంత లాభం పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పేరుతో తీసుకొచ్చిన ఈ స్కీమ్లో రిస్క్ లేకుండా పెట్టుబడి పెట్టొచ్చు.
ఈ పథకం 15 ఏళ్లలో మెచ్యూర్ అవుతుంది. ఇందులో ఏడాదికి రూ. 500 నుంచి గరిష్టంగా రూ. లక్షన్నర వరకు డిపాజిట్ చేయొచ్చు. ఈ పథకంలో ప్రస్తుతం వడ్డీ రేటు 7.1 శాతంగా ఉంది. ఉదాహరణకు మీరు నెలకు రూ. 1000 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే ఏకంగా రూ. 8 లక్షల వరకు పెంచుకోవచ్చు. ఇంతకీ రూ. 8 లక్షలు రిటర్న్ రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ పథకంలో నెలకు రూ. 1000 పెట్టుబడి పెడితే ఏడాదికి మొత్తం రూ. 12000 అవుతాయి. ఇలా 15 ఏళ్లపాటు పెట్టుబడి పెట్టాలి. 15 ఏళ్లకు మెచ్యూరిటీ అవుతుంది. అయితే 5 ఏళ్ల చొప్పున మరో రెండు డిడదలు పెట్టుబడి పెట్టుకుంటూ పోవాలి. ఇలా మొత్తం 25 ఏళ్ల పాటు ప్రతీ నెల రూ. 1000 పెట్టుబడి పెట్టుకుంటూ పోతే మొత్తం రూ. 3 లక్షలు అవుతుంది. వడ్డీరేటుతో పాటు మీ మెచ్యూరిటీ సమయానికి మొత్తం రూ. 8,24,641 సొంతం చేసుకోవచ్చు. అయితే 15 ఏళ్ల తర్వాత మీ స్కీమ్ను మరింత పొడగించుకోవాల్సి ఉంటే.. మీరు మెచ్యూరిటీ తేదీకి 1 ఏడాదికి ముందే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..