Budget 2024: ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం: బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌

|

Jul 23, 2024 | 12:19 PM

Budget 2024: పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఏడో సారి 2024 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.ఈ బడ్జెట్‌లో వ్వయసాయ రంగానికి పెద్ద పీఠ వేశారు.

Budget 2024: ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నాం: బడ్జెట్‌లో నిర్మలాసీతారామన్‌
Budget
Follow us on

పార్లమెంట్‌లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ 2024 వార్షిక బడ్జెట్‌ను సమర్పించారు. ఈ బడ్జెట్‌లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పారు. అలాగే ఏపీకి వరాల జల్లు కురిపించారు. ఏపీ రాజధాని అమరావతికి రూ.15 వేల కోట్లు కేంటాయించినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే ఏపీలో ప్రత్యేక అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఏపీ విభజన చట్టానికి కట్టుబడి ఉన్నామని మంత్రి వెల్లడించారు. విభజన చట్టానికి అనుగుణంగా చర్యలు చేపట్టనున్నామన్నారు. అమరావతి నిర్మాణానికి బహుళ సంస్థల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు పేర్కొన్నారు.

అమరావతి నిర్మాణానికి ప్రత్యేక ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి నిర్మలమ్మ.. సాధ్యమైనంత వరకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. అంతేకాకుండా రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం అభివృద్ధికి నిధులను కేటాయిస్తామన్నారు. విశాఖ-చెన్నై, ఓర్వకల్లు-బెంగళూరు పారిశ్రామక కారిడార్‌కు నిధులు చేటాయిస్తున్నట్లు చెప్పారు. అలాగే ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు తోడ్పాటును అందిస్తామన్నారు. విభజన చట్టం ప్రకారం

ఉద్యోగాలు – నైపుణ్యాలు

ఐదు పథకాల కోసం పీఎం ప్యాకేజీ
విద్య, ఉద్యోగాలు నైపుణ్యాల కోసం రూ.2 లక్షల కోట్లు
ఇందులో ఈ ఏడాదిలో రూ.1.48 లక్షల కోట్లు
ఉన్నత విద్యారుణాలకు రూ.10 లక్షలు


మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇది కూడా చదవండి: Indian Railways: రైలు లీటర్‌ డీజిల్‌కు ఎంత మైలేజీ ఇస్తుందో తెలుసా?