Budget 2024 – Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు..

|

Jul 23, 2024 | 2:57 PM

పసిడి, వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించారు. ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు.

Budget 2024 - Gold Rates: బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న ధరలు..
Gold Price
Follow us on

మోదీ 3.0 బడ్జెట్‌ ను నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెడుతున్నారు. వరుసగా ఏడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన నిర్మల సీతారామన్ పలు కీలక అంశాలను వెల్లడించారు. రూ.32.07 లక్షల కోట్లతో మోదీ సర్కార్ కేంద్ర బడ్జెట్‌ ను ప్రవేశపెట్టారు. ఈ క్రమంలో పసిడి, వెండి కొనుగోలుదారులకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.. బంగారం, వెండిపై కస్టమ్‌ డ్యూటీ తగ్గించారు. బంగారం, వెండిపై సుంకం 6 శాతానికి తగ్గించారు. ప్లాటినమ్‌పై 6.4 శాతాననికి కుదించినట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ వెల్లడించారు. గతంలో 10 శాతం ఉండగా.. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ పై 6శాతానికి తగ్గిస్తున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. దీంతో బంగారం, వెండి ధరలు తగ్గనున్నాయి.

మొబైల్ ఫోన్లు, ఛార్జర్లను కూడా తక్కువ ధరకు అందజేస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. సీ ఫుడ్స్, తోలుతో చేసిన వస్తువులు కూడా తక్కువ ధరకే లభిస్తాయి. బంగారం, వెండితో చేసిన ఆభరణాలు కూడా చౌకగా మారనున్నాయి..

మూడు క్యాన్సర్ మందులను కస్టమ్ డ్యూటీ ఫ్రీగా మార్చారు. వీటిపై జీఎస్టీ తొలగించడంతో ఈ మందులు తక్కువ ధరకే లభిస్తాయి.

బడ్జెట్ లైవ్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు టీవీ9లో చూడండి..