
దేశీయ టెలికాం రంగంలో ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం ఉన్నప్పటికీ ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన యూజర్లకు అతితక్కువ ధరల్లో మెరుగైన డీల్స్ను అందిస్తుంది. బీఎస్ఎన్ఎల్ అందించే ఆఫర్లకు ప్రైవేట్ సంస్థలు దరిదాపుల్లో కూడా లేవు. తక్కువ ధరకే ఎక్కువ కాలం వ్యాలిడిటీని కోరుకునే లక్షలాది మంది వినియోగదారుల కోసం సరికొత్త ప్లాన్ను తీసుకొచ్చింది. రూ.500 కంటే తక్కువ ధరలో 72 రోజుల ప్లాన్ను అందుబాటులోకి తెచ్చింది.
ఈ ప్లాన్ ద్వారా వినియోగదారులకు లభించే ప్రధాన ప్రయోజనాలు
బీఎస్ఎన్ఎల్ 365 రోజుల చెల్లుబాటు ప్లాన్ను కూడా కేవలం రూ.2399 ధరకే అందిస్తోంది. ఈ వార్షిక ప్లాన్లో కూడా 2GB రోజువారీ డేటా, 100 ఉచిత SMS సందేశాలు, అపరిమిత కాలింగ్, ఉచిత జాతీయ రోమింగ్ ప్రయోజనాలు లభిస్తాయి.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4G సేవలను విస్తరిస్తున్న BSNL త్వరలో 5G సేవలను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం.. BSNL వచ్చే ఏడాది ప్రారంభంలో 5G సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. తొలి దశలో ఢిల్లీ, ముంబై వంటి రెండు మెట్రో నగరాల్లో పరిమిత సైట్లతో 5G సేవలు మొదలయ్యే అవకాశం ఉంది. ఇటీవల BSNL దేశం అంతటా ప్రారంభించిన 4G నెట్వర్క్ పూర్తిగా స్వదేశీ టెక్నాలజీతో రూపొందించారు. ఇది 5Gరెడీగా ఉండటం వలన బీఎస్ఎన్ఎల్ తక్కువ సమయంలోనే 5Gకి మారడం సులభతరం అవుతుంది. స్వదేశీ నెట్వర్క్ అనేది భద్రత, దేశీయ సాంకేతిక అభివృద్ధికి ఒక గొప్ప మైలురాయిగా నిలుస్తోంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి