AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BSNL: జియో, ఎయిర్‌టెల్‌, వీలకు భారీ షాక్‌.. BSNLకు 12 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లు!

BSNL: గత రెండు నెలల్లో పెద్ద ప్రైవేట్ కంపెనీలు 11.9 మిలియన్ల కస్టమర్లను కోల్పోగా, BSNL 5.4 మిలియన్ కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. గత రెండు నెలల్లో, టెలికాం కంపెనీల వ్యాపారం నేరుగా ఖరీదైన రీఛార్జ్‌లతో ప్రభావితమైంది. ఇప్పటి వరకు బీఎస్‌ఎన్‌ఎల్‌కు..

BSNL: జియో, ఎయిర్‌టెల్‌, వీలకు భారీ షాక్‌.. BSNLకు 12 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్లు!
Subhash Goud
|

Updated on: Nov 01, 2024 | 2:53 PM

Share

ప్రైవేట్ టెలికాం కంపెనీల ఖరీదైన మొబైల్ రీచార్జిల తర్వాత.. ఆ కంపెనీల సేవలను పొందేందుకు కస్టమర్లు వెనకడుగు వేస్తున్నారు. ఫలితంగా BSNL అత్యధికంగా లాభపడింది. ఎందుకంటే వినియోగదారులు వేగంగా ప్రైవేట్ టెలికాం కంపెనీల సేవలను వదిలి BSNLకి చేరుతున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ గత రెండు నెలల్లో 5.4 మిలియన్ కొత్త సబ్‌స్క్రైబర్‌లను చేర్చుకుంది. డేటా ప్రకారం.. మొబైల్ రీఛార్జ్‌లు ఖరీదైన తర్వాత దేశంలోని దాదాపు 12.5 మిలియన్ల మంది వినియోగదారులు ప్రైవేట్ టెలికాం కంపెనీల సేవలను వదిలి బీఎస్‌ఎన్‌ఎల్‌లోకి చేరినట్లు నివేదికలు చెబుతున్నాయి. టెలికాం రెగ్యులేటర్ (TRAI) ఆగస్టు వినియోగదారుల డేటా నివేదిక ప్రకారం, టెలికాం సేవల రీఛార్జ్‌లు ఖరీదైన తర్వాత ప్రైవేట్ కంపెనీల కస్టమర్ల సంఖ్య బాగా తగ్గింది. దీని ప్రకారం, మూడు అతిపెద్ద టెలికాం కంపెనీలు ఆగస్టులో 8.2 మిలియన్ల సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి.

ఇది కూడా చదవండి: TRAI: నవంబర్‌ 1 నుంచి కాదు.. జనవరి 1 నుంచి.. గడువు పొడిగించిన ట్రాయ్‌!

దీనికి విరుద్ధంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.5 మిలియన్ల కొత్త సబ్‌స్క్రైబర్‌లను సంపాదించుకుంది. టెలికాం రంగంలోని నిపుణుల అభిప్రాయం ప్రకారం, జూలైలో రీఛార్జ్ రేట్లను పెంచినప్పటి నుండి వినియోగదారులు తమ నంబర్లను BSNLకు పోర్ట్‌ పెట్టుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

బీఎస్‌ఎన్‌ఎల్‌ మినహా అన్ని ప్రైవేట్ కంపెనీలు గత రెండు నెలల్లో వినియోగదారులను కోల్పోయాయి. అలాగే మొబైల్ నంబర్ పోర్టబిలిటీకి డిమాండ్ 15 శాతం పెరిగింది. జూలైలో రీఛార్జ్‌లు ఖరీదైనవి కావడంతో వినియోగదారులు వేగంగా ప్రైవేట్ కంపెనీల సేవలను వదులుకోవడం ప్రారంభించారు. జూలైలో మాత్రమే ప్రధాన టెలికాం కంపెనీలు 3.7 మిలియన్ల సబ్‌స్క్రైబర్‌లను కోల్పోగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ 2.9 మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను పొందింది.

ఒక నెలలో 13 మిలియన్ల వినియోగదారులు నంబర్ పోర్టబిలిటీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. జూన్‌లో దరఖాస్తుల సంఖ్య 1 మిలియన్ మాత్రమే. గణాంకాల ప్రకారం, గత రెండు నెలల్లో పెద్ద ప్రైవేట్ కంపెనీలు 11.9 మిలియన్ల కస్టమర్లను కోల్పోగా, బీఎస్‌ఎన్‌ఎల్‌ 5.4 మిలియన్ కొత్త కస్టమర్లను సంపాదించుకుంది. అందువల్ల గత రెండు నెలల్లో టెలికాం కంపెనీల వ్యాపారం ఖరీదైన రీఛార్జ్‌ల వల్ల ప్రత్యక్షంగా ప్రభావితమైంది.

ఇది కూడా చదవండి: LPG Cylinder: దీపావళి పండగ వేళ సామాన్యులకు షాక్‌.. పెరిగిన గ్యాస్‌ సిలిండర్ ధర

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us