
ఈ రోజుల్లో డబ్బు సంపాదించడం కంటే డబ్బును నిర్వహించడం ప్రజలకు చాలా కష్టంగా మారింది. చాలా మంది జీతాలు వచ్చిన వెంటనే ఖర్చు చేస్తారు. నెలాఖరులో అప్పులు చేయాల్సి వస్తుంది. అదే సమయంలో నెలాఖరు వరకు ఏమీ మిగలకపోవడంతో వారు ఏమీ ఆదా చేయలేరు. అటువంటి పరిస్థితిలో ఓ 5 వ్యక్తిగత ఆర్థిక నియమాల పాటిస్తే మీ చేతుల్లో నాలుగు డబ్బులు మిగులుతాయి. వీటిని పాటించడం ద్వారా మీరు ఆర్థికంగా మెరుపడొచ్చు.
50-30-20 నియమం ప్రకారం 50 అంటే మీరు మీ జీతంలో 50 శాతం అవసరమైన ఖర్చులకు మాత్రమే ఖర్చు చేయాలి. ఇందులో అద్దె, రేషన్, బిల్లులు, ఇతర అవసరమైన ఖర్చులు ఉంటాయి. మీ జీతంలో 30 శాతం మీ కోసం ఉంచుకోండి. మీ అవసరాలు, కోరికల కోసం ఖర్చు చేయండి. మీ జీతంలో 20 శాతం ఆదా చేసి పెట్టుబడి పెట్టండి.
మీకోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోండి, ఇది కష్ట సమయాల్లో ఉపయోగపడుతుంది. అత్యవసర నిధి 3 నుండి 6 నెలల ముఖ్యమైన ఖర్చులను భరించడానికి సరిపోతుంది. ఉద్యోగం కోల్పోవడం, వైద్య అత్యవసర పరిస్థితులు, ఆకస్మిక ఆదాయ నష్టం జరిగినప్పుడు ఈ నిధి ఉపయోగపడుతుంది.
మీ నెలవారీ EMIలలో దేనికైనా EMI మీ మొత్తం ఆదాయంలో 40 శాతానికి మించకూడదు. మీ EMI దీని కంటే ఎక్కువగా ఉంటే, మీరు ఆదా చేయలేరు. అలాగే మీరు అవసరమైన ఖర్చులు చేయలేరు.
పెట్టుబడులకే కాకుండా బీమాకు కూడా ప్రాధాన్యత ఇవ్వండి. అటువంటి పరిస్థితిలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఆరోగ్య, టర్మ్ జీవిత బీమా తీసుకోండి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి