
Ration Card: మీకు రేషన్ కార్డు ఉండి, మీరు తెలంగాణ నివాసి అయితే, ఈ వార్త మీ కోసమే. నివేదికల ప్రకారం, రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులు జూలై 31వ తేదీలోగా తమ రేషన్ కార్డు eKYC ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంది. అయితే, ఈ గడువుకు సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇంకా ఎలాంటి తాజా సమాచారాన్ని విడుదల చేయలేదు. అందువల్ల, ఈ ముఖ్యమైన పనిని నిర్దేశించిన కాలపరిమితిలోగా పూర్తి చేసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. లేకుంటే మీరు ఇబ్బందులు పడాల్సి ఉంటుందని గుర్తించకోండి.
నివేదికల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో సుమారు 1,05,42,188 రేషన్ కార్డులు ఉన్నాయి . ఈ కార్డుదారులలో దాదాపు 75% మంది తమ ఇ-కెవైసిని పూర్తి చేసుకున్నారు. కాగా మిగిలిన 25% మంది జూలై 31 లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంది. నిరంతరాయంగా రేషన్ అందాలంటే ఇ-కెవైసి ధృవీకరణ తప్పనిసరి అని గమనించాలి. ఈ పనిని పలు విధాలుగా పూర్తి చేయవచ్చు.
ఇది కూడా చదవండి: Swiggy Instamart: సూపర్ గుడ్న్యూస్.. ఇప్పుడు ఇన్స్టామార్ట్లో గ్యాస్ సిలిండర్లు.. 10 నిమిషాల్లోనే డెలివరీ..!
మీరు ఆన్లైన్ ఇ-కేవైసి కాకుండా వేరే పద్ధతిని ఉపయోగించాలనుకుంటే, దానిని నేరుగా రేషన్
షాపు ద్వారా త్వరగా పూర్తి చేసుకోవచ్చు. దీనికోసం మీరు మీ రేషన్ కార్డుతో పాటు ఆధార్ కార్డును కూడా షాపుకు తీసుకురావాలి. అప్పుడు షాపు యజమాని ఇ-పీఓఎస్ మెషీన్ ద్వారా మీ బయోమెట్రిక్ వెరిఫికేషన్ పూర్తి చేసి, మీ ఇ-కేవైసిని ప్రాసెస్ చేస్తారు.
ప్రభుత్వం అందించే ఉచిత ఆహార ధాన్యాలను స్వీకరించడానికి రేషన్ కార్డు అత్యవసరం మాత్రమే కాకుండా, అది గుర్తింపు పత్రంగా కూడా పనిచేస్తుందని గమనించాలి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను సరైన వ్యక్తులే పొందుతున్నారని నిర్ధారించుకోవడానికి రేషన్ కార్డు e-KYC చాలా కీలకం. దీనివల్ల ఇది రేషన్ కార్డు మోసాలను నివారించడంలో సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి: Gold, Silver Prices: రికార్డు స్థాయిల నుంచి దిగొచ్చిన గోల్డ్, సిల్వర్.. తులం బంగారంపై రూ. 13 వేలు, వెండిపై రూ. 45 వేలు డౌన్!
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి