
రిటైర్మెంట్ అంటే విశ్రాంతి తీసుకునే సమయం. ఆ వయసులో కష్టపడి ఉద్యోగం చేయడం, సంపాదించడం కుదరకపోవచ్చు. కాబట్టి అప్పటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పట్నుంచే రిటైర్మెంట్ ప్లానింగ్ మొదలు పెట్టాలి. నిపుణులు ప్రకారం రిటైర్మెంట్ తర్వాత మంచి ఫండ్ సమకూరాలంటే ఇప్పట్నుంచే మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం మంచిది. రిటైర్మెంట్ నాటికి ప్రతి నెలా రూ. 2 లక్షలు రావాలంటే ఎంత పెట్టుబడి పెట్టాలో ఇప్పుడు చూద్దాం.
మీరు 55 లేదా 60 ఏళ్ల వయస్సులో పదవీ విరమణ చేయబోతున్నట్లయితే దానికి 35 ఏళ్ల వయసు నుంచే పెట్టుబడి మొదలు పెట్టాలి. ఈ జనరేషన్ లో చాలామంది ఎర్లీ రిటైర్మెంట్ కోరుకుంటున్నారు. అంటే 50 ఏళ్లు లేదా అంతకంటే తక్కువ వయసులోనే రిటైర్ అవ్వాలని కలలు కంటుంటారు. మరి అలాంటప్పుడు ఇన్వెస్ట్ మెంట్స్ ముందు నుంచే మొదలుపెట్టాలి. రిటైర్ మెంట్ కలలు నెరవేరాలంటే దానికి తగిన డబ్బు కచ్చితంగా ముందే సమకూర్చుకోవాలి. పెట్టుబడులు ఆలస్యంగా మొదలుపెడితే రిటైర్మెంట్ నాటికి వచ్చే ఫండ్ వాల్యూ తగ్గిపోతుంటుంది. కాబట్టి దానికి అనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.
ఒకవేళ మీరు కెరీర్ మొదట్లో తక్కువ పెట్టుబడి పెట్టినా 40 ఏళ్ల వయసు నుంచి కనీసం నెలకు రూ. 25,000 SIP ద్వారా పెట్టుబడి పెట్టాలి. అలాగే ప్రతి సంవత్సరం పెట్టుబడి మొత్తంలో 10% జోడిస్తూ పోవాలి. ఇలా చేస్తే 60 ఏళ్ల నాటికి మీ ఫండ్ రూ.3.50 కోట్లు దాటుతుంది. SWP (సిస్టమాటిక్ విత్డ్రాయల్ ప్లాన్) ద్వారా ఈ పెట్టుబడి నుంచి నెలకు రూ. 2 లక్షలు తీసుకున్నా.. జీవితకాలం పాటు ఫండ్ సరిపోతుంది. ఆర్థిక నిపుణుల సలహా ప్రకారం పైన చెప్పిన ఫార్ములా ప్రకారం యంగ్ ఏజ్ నుంచే పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. రిటైర్మెంట్ నాటికి ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా హాయిగా జీవితాన్ని గడపొచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి