ట్యాక్స్ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్… గడువును పెంచుతూ ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం..

Income Tax Return: ట్యాక్స్ చెల్లింపుదారులకు ఐటీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ ఆదాయపు పన్ను శాఖ పనుల చెల్లింపుకు గడువును..

ట్యాక్స్ చెల్లింపుదారులకు గుడ్ న్యూస్... గడువును పెంచుతూ ఆదాయపు పన్ను శాఖ కీలక నిర్ణయం..

Updated on: May 01, 2021 | 10:42 PM

ట్యాక్స్ చెల్లింపుదారులకు ఐటీ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం ఇస్తూ ఆదాయపు పన్ను శాఖ పనుల చెల్లింపుకు గడువును పెంచాలని నిర్ణయించింది. 2021 మార్చి 31 తో ముగిసిన 2020-21 అంచనా గడువును 31 మే 2021 కి పెంచింది. 31 మార్చి 2021 నాటికి లేట్ ఫైన్ తో రిటర్న్స్ దాఖలు చేసే అవకాశం కల్పించింది.

ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఈ ఉత్తర్వు ప్రకారం 2020-21 అంచనా సంవత్సరానికి ఆదాయపు పన్ను చట్టం 1961 లోని సెక్షన్ 139 లోని 4తోపాటు  5 ఉప సెక్షన్ల కింద ఆలస్యంగా తిరిగి చెల్లించేందుకు రిటర్న్ తేదీని 2021 మే 31 వరకు పెంచడం జరిగింది. అంతకుముందు ఈ గడువు 31 మార్చి 2021 తో ముగిసింది.

అధ్యాయం ప్రకారం అప్పీల్ టు కమిషనర్ కేసులో రిటర్న్ దాఖలు చేసిన చివరి తేదీ ఏప్రిల్ 1, 2021 వరకు ఉంది. ఇది మే 31 వరకు పొడిగించబడింది. సెక్షన్ 144 సి కింద రిటర్న్స్ దాఖలు చేయడానికి చివరి తేదీ ఏప్రిల్ 1 వరకు ఉంది. ఇది మే 31 వరకు పొడిగించబడింది. సెక్షన్ 148 కింద నోటీసులు వస్తే రిటర్న్ ఫైలింగ్ కోసం గడువును మే 31 వరకు పొడిగించారు.

ఇవి కూడా చదవండి:SBI Home Loan: హోమ్ లోన్‌ కోసం ప్ర‌య‌త్నిస్తున్నారా.? అయితే మీకు గుడ్ న్యూస్‌.. వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించిన ఎస్‌బీఐ..

Air Lift: బోయింగ్ 737 విమానం.. ఒక్కడే ప్రయాణీకుడు..4 వేల కిలోమీటర్లు..ఎందుకంటే..

 

 

Loading...
Unable to load recommendations.
Follow Us