Bank Employees Strike: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. యూనియన్ల సమ్మె.. ఆ రెండు రోజులు బ్యాంక్స్ బంద్..

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఆ రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU సమ్మె చేస్తామని హెచ్చరించారు.

Bank Employees Strike: బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. యూనియన్ల సమ్మె.. ఆ రెండు రోజులు బ్యాంక్స్ బంద్..
Follow us

|

Updated on: Feb 10, 2021 | 6:56 AM

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్. ఆ రెండు రోజులు బ్యాంక్ ఉద్యోగులు సమ్మెకు దిగనున్నారు. యూనైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ UFBU సమ్మె చేస్తామని హెచ్చరించారు. దీంతో ఆ బ్యాంకులు రెండు రోజుల వరకు ఎలాంటి లావాదేవీలు జరగవు. యూఎఫ్‏బీయూలో దాదాపు 9 యూనిట్లు ఉంటాయి. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుండడంతో.. తాము మార్చి 15 నుంచి సమ్మె చేయనున్నట్లుగా యూఎఫ్‏బీయూ స్పష్టం చేసింది.

కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరణ చేయనున్నట్లుగా 2021 బడ్జెట్‏లో ప్రకటించింది. దీంతో బ్యాంక్ యూనియన్లు ఆ నిర్ణయాన్ని తప్పుబట్టాయి. ఇప్పటికే ఐడీబీఐ బ్యాంకును ప్రైవేటీకరించింది. ఎల్ఐసీ ఈ బ్యాంకును కొనుగోలు చేసింది. గత 4 ఏళ్ళలో కేంద్రం 14 బ్యాంకులను విలీనం చేసింది. మంగళవారం జరిగిన యూఎఫ్‏బీయూ సమావేశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని తాము అంగీకరించడం లేదని… అందుకే రెండు రోజులపాటు సమ్మె చేయనున్నట్లుగా ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ AIBEA జనరల్ సెక్రటరీ హీహెచ్ వెంకటచలం తెలిపారు. ఈ కారణాంగా మార్చి 15, 16 తేదీలలో బ్యాంకులు పనిచేయవు. అందువలన కస్టమర్లు ఆ రెండు రోజులు బ్యాంకులు బంద్ అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.

Also Read: ఐసీఐసీఐ మొబైల్ యాప్‏లో కీలక మార్పు.. ఇతర బ్యాంకుల కస్టమర్లకు ఇకపై అందుబాటులోకి.

Latest Articles