
దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ బ్యాంకులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) సెలవులను జారీ చేస్తుంటుంది. ప్రతి నెల ఎన్ని రోజుల పాటు సెలవులు ఉండనున్నాయో జాబితాను విడుదల చేస్తుంటుంది. అయితే, స్థానిక పండుగల ఆధారంగా కూడా ఆయా ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉంటాయి. అయితే, హైదరాబాద్ బోనాల సందర్భంగా వరుసగా బ్యాంకులకు 3 రోజుల పాటు సెలవులు రానున్నాయి. అయితే, ఇందులో జూలై 19వ తేదీ శనివారం కేవలం త్రిపురలో కేర్ పుడ సందర్భంగా ఆ ప్రాంతంలో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఇది అక్కడి సంప్రదాయపు పండుగ. అందుకే సెలవు ఉంటుంది.
ఇది కూడా చదవండి: BSNL Plans: 12 నెలల పాటు రీఛార్జ్ చేయాల్సిన అవసరం లేదు.. ఉత్తమ ప్లాన్స్!
ఇక 20వ తేదీ ఆదివారం సాధారణంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆ మరుసటి రోజు జూలై 21వ తేదీ హైదరాబాద్ బోనాలు పండుగ సెలవు ఉంది. ఈ సందర్భంగా ఆరోజు కేవలం బ్యాంకులు మాత్రమే కాదు పాఠశాలలకు కూడా సెలవు ఉంటుంది.
బోనాలు తెలంగాణ రాష్ట్ర పండుగ. గ్రామ దేవతలకు ఈరోజు భోజనం సమర్పించే రోజు. అయితే, జూలై 26వ తేదీ నాలుగో శనివారం కూడా బ్యాంకులు మూసి ఉంటాయి. 27 ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. జూలై 28వ తేదీ సిక్కీంలో బ్యాంకులకు సెలవు. ఆరోజు దృక్ప షే జీ. బ్యాంకులు బంద్ ఉన్నన్నప్పటికీ ఆన్లైన్ సేవలు యథావిధిగా కొనసాగుతాయి. ఏటీఎం సేవలు కూడా అందుబాటులో ఉంటాయి. ఎక్కువ మొత్తంలో డిపాజిట్ లేదా విత్డ్రా చేయాలంటేనే ఇబ్బందులు.
ఇది కూడా చదవండి: School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. సంచలన నిర్ణయం.. జూలై 23 వరకు పాఠశాలలకు సెలవు!
ఇది కూడా చదవండి: Indian Railways: రైల్వే టిక్కెట్ల బుకింగ్ ఎన్ని రోజుల ముందుగానే ప్రారంభమవుతుంది? నియమాలేంటి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి