UPI Rules: యూపీఐ ఖాతాదారులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

భారతదేశంలో నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్‌పీసీఐ ద్వారా యూపీఐ సేవలను పౌరులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. తక్కువ సమయంలోనే యూపీఐ సేవలను ప్రజలను ఆకర్షించాయి. చిన్న మొత్తాల చెల్లింపులకు చాలా మంది యూపీఐను వాడుతున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు యూపీఐ రూల్స్‌ను ఏప్రిల్ 1 నుంచి మార్చనున్నాయి. ఆ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.

UPI Rules: యూపీఐ ఖాతాదారులకు అలెర్ట్.. ఏప్రిల్ 1 నుంచి కొత్త నిబంధనలు

Updated on: Mar 05, 2025 | 8:16 PM

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) ఏప్రిల్ 1 నుంచి యూపీఐ సేవల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకురానుంది. ముఖ్యంగా బ్యాంకులు డిస్‌కనెక్ట్ చేసిన, లేదా సరెండర్ చేసిన నంబర్‌లను ఎప్పటికప్పుడు తొలగించడం ద్వారా వారి జాబితాను క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. నంబర్ ఆధారిత యూపీఐ చెల్లింపుల్లో వినియోగదారు సౌలభ్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఈ కీలక అప్‌డేట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జూలై 16, 2024న స్టీరింగ్ కమిటీ సమావేశంలో చర్చించిన అంశాలకు అనుగుణంగా ఈ కొత్త నిబంధనను ఎన్‌పీసీఐ రూపొందించింది. తాజా మార్గదర్శకాల ప్రకారం బ్యాంకులు మొబైల్ నంబర్ రద్దు జాబితా తెలుసుకోవడానికి డిజిటల్ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించాలి. అలాగే కనీసం వారానికోసారి క్రమం తప్పకుండా వారి డేటాబేస్‌ను అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

యూపీఐ నంబర్‌ను సీడింగ్ లేదా పోర్ట్ చేయడానికి యూపీఐ యాప్‌లు స్పష్టమైన ఆప్ట్-అవుట్ ఎంపికతో  స్పష్టమైన యూజర్ యాక్సెప్‌టెన్సీ పొందాలి. యూపీై యాప్ తప్పుదారి పట్టించే/బలవంతపు సందేశాలు లేకుండా స్పష్టమైన కమ్యూనికేషన్‌ను అందించాల్సి ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ లావాదేవీ సమయంలో లేదా సమయంలో యూజర్ యాక్సెప్టెన్సీను తీసుకోకూడదు. ఈ చర్యల కారణంగా యూపీఐ నంబర్ సీడింగ్ లేదా పోర్టింగ్ కమ్యూనికేషన్‌లు తప్పుడు కమ్యూనికేషన్‌ను తొలగించవచ్చు. ఈ నూతన మార్గదర్శకాలను బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ సంస్థలు  మార్చి 31, 2025 లోపు పాటించాలని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది. 

మార్చి 31, 2025 నాటికి అన్ని బ్యాంకులు, యూపీఐ సర్వీస్ ప్రొవైడర్లు ఈ కొత్త నియమాలను పాటించాలి. ఏప్రిల్ 1, 2025 నుంచి ఎన్‌పీసీఐతో వివరణాత్మక నెలవారీ నివేదికలను కూడా పంచుకోవాల్సి ఉంటుంది. మొబైల్ నంబర్లకు లింక్ చేసిన యూపీఐ ఐడీలు, నెలకు క్రియాశీల ప్రత్యేక వినియోగదారుల వివరాలను వెల్లడించాలి. అలాగే అప్‌డేట్ చేసిన  మొబైల్ నంబర్ వ్యవస్థను ఉపయోగించి నిర్వహించిన లావాదేవీల సంఖ్యను కూడా పేర్కొనాల్సి ఉంటుంది. అలాగే స్థానికంగా పరిష్కరించిన యూపీఐ నంబర్ ఆధారిత లావాదేవీల వివరాలను తెలపాల్సి ఉంటుంది. ఎన్‌పీసీఐ చర్యల కారణంగా బ్యాంకులు వారానికోసారి మొబైల్ నంబర్ రికార్డులను అప్‌డేట్ చేయాలి. ఇలా చేస్తే విఫలమైన లేదా తప్పుదారి పట్టించే లావాదేవీల ప్రమాదం గణనీయంగా తగ్గుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి