AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!

అక్షయ తృతీయ 2026 సందర్భంగా ఏప్రిల్ 19న బంగారం, ఆభరణాల కొనుగోళ్లకు డిమాండ్ పెరగనుంది. వినియోగదారుల కోసం ప్రముఖ జ్యువెలరీ సంస్థలు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించాయి. గోల్డ్ ప్రైస్ లాక్, తయారీ ఛార్జీలపై 30 శాతం వరకు డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్, ప్రీ-బుకింగ్ సౌకర్యాలు ప్రధాన ఆకర్షణలు.

Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఆఫర్లు.. బంగారం కొనాలనుకుంటున్న వారికి పండగే!
Gold 3
SN Pasha
|

Updated on: Apr 16, 2026 | 6:00 AM

Share

అక్షయ తృతీయ 2026 సందర్భంగా దేశవ్యాప్తంగా ఆభరణాల మార్కెట్‌లో సందడి మొదలైంది. ఈసారి ఏప్రిల్ 19న జరగనున్న ఈ పండుగను పురస్కరించుకుని ప్రముఖ జ్యువెలరీ సంస్థలు వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లు, పథకాలను ప్రకటించాయి. సంప్రదాయంగా ఈ రోజున బంగారం కొనడం శుభప్రదంగా భావించడంతో ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా డిమాండ్ గణనీయంగా పెరుగుతుందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.

ఈ ఏడాది ప్రధాన ఆకర్షణగా బంగారం ధర లాక్, రక్షణ పథకాలు నిలిచాయి. తనిష్క్, జోయలుక్కాస్‌, మలబార్ గోల్డ్ అండ్‌ డైమండ్స్, కృష్ణ డైమండ్ అండ్‌ గోల్డ్ జ్యువెలరీ వంటి ప్రముఖ సంస్థలు వినియోగదారులకు ముందుగానే ధరను లాక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నాయి. దీని ద్వారా బిల్లింగ్ సమయంలో మార్కెట్ ధర పెరిగినా, వినియోగదారులు తక్కువ ధరకే కొనుగోలు చేయగలుగుతారు. అదే సమయంలో ధర తగ్గినా, తక్కువ ధర ప్రయోజనం వారికి అందుతుంది. ఇక తయారీ ఛార్జీలపై కూడా భారీ తగ్గింపులు ప్రకటించబడ్డాయి. ముఖ్యంగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ బంగారం, స్టడ్ ఆభరణాలపై 30 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. వజ్రాల ఆభరణాలపై కూడా ప్రత్యేక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇవి పరిమిత కాలం పాటు మాత్రమే వర్తిస్తాయని సంస్థలు స్పష్టం చేస్తున్నాయి.

క్యాష్‌బ్యాక్, గిఫ్ట్ వోచర్‌ల రూపంలో కూడా వినియోగదారులకు లాభాలు అందుతున్నాయి. జోయలుక్కాస్‌ సంస్థ బంగారం, వజ్రాలు, వెండి ఆభరణాల కొనుగోళ్లపై ఆకర్షణీయమైన వోచర్‌లను అందిస్తోంది. దీంతో వినియోగదారులు తదుపరి కొనుగోళ్లలో అదనపు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. అలాగే కేవలం 10 నుంచి 25 శాతం అడ్వాన్స్‌తో ప్రీ-బుకింగ్ సౌకర్యం కల్పించడం మరో ముఖ్య అంశంగా నిలిచింది. దీని ద్వారా వినియోగదారులు ముందుగానే తమ కొనుగోళ్లను ప్లాన్ చేసుకుని, ఆర్థిక భారం తగ్గించుకోవచ్చు. ఆభరణాల వ్యాపారుల ప్రకారం, వారి వార్షిక ఆదాయంలో సుమారు 15 నుంచి 18 శాతం అక్షయ తృతీయ సమయంలోనే వస్తుంది. ఈ నేపథ్యంలో ప్రకటించిన ఆఫర్లు ఈసారి కూడా బంగారం కొనుగోళ్లను మరింత పెంచే అవకాశముందని వారు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే, అక్షయ తృతీయ 2026 వినియోగదారులకు మంచి డీల్స్ దక్కే అవకాశంగా మారనుంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us