Air India Plane Crash: విమానంలో 11A సీటుకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ సీటు అంత సురక్షితమా? ప్రత్యేకత ఏంటి?

Air India Plane Crash: విమానాల సీట్ల కాన్ఫిగరేషన్‌లు చాలా వరకు మారుతూ ఉంటాయి. మనుగడ తరచుగా సంక్లిష్టమైన అంశాల పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సీటు అన్నింటికి సురక్షితం కాకపోవచ్చని విమానయాన నిపుణులు అంటున్నారు. ఎందుకంటే విమానాలను..

Air India Plane Crash: విమానంలో 11A సీటుకు పెరుగుతున్న డిమాండ్‌.. ఈ సీటు అంత సురక్షితమా? ప్రత్యేకత ఏంటి?

Updated on: Jun 19, 2025 | 7:21 PM

Air India Plane Seat: జూన్ 12, 2025న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా విమానం AI-171 విషాదకరమైన ప్రమాదంలో 241 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే విమానంలో 242 మంది ఉండగా, ఒక్క ప్రయాణికుడు ప్రాణాలతో బతికి బయటపడ్డాడు. ఇప్పుడు అతను బతకడం అందరిని ఆశ్చర్యం కలిగిస్తోంది. అతను కూర్చున్న సీటు నంబర్‌ 11A. అక్కడే ప్రాణాలతో బయటపడిన ఏకైక వ్యక్తి, 40 ఏళ్ల విశ్వష్‌కుమార్ రమేష్ కూర్చున్నాడు. అప్పటి నుండి, ఆ సీటు కోసం అభ్యర్థనలు పెరిగాయని భారతీయ ట్రావెల్ ఏజెంట్లు నివేదించారు. కొంతమంది ప్రయాణికులు దాని కోసం అదనపు డబ్బు చెల్లించడానికి కూడా సిద్ధంగా ఉన్నారట. బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. ఆ తర్వాత UKకి చెందిన ప్రయాణికుడు రమేష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతని పక్కన కూర్చున్న అతని సోదరుడు మృతి చెందాడు. అత్యవసర నిష్క్రమణ వరుసలో కూర్చున్న రమేష్ అద్భుతంగా తప్పించుకోవడం అందరిని ఆశ్యర్యపరుస్తోంది.

ఇది కూడా చదవండి: Akshay Kumar: అక్షయ్ కుమార్ తాగే వాటర్‌ ఏంటో తెలుసా? అందుకే 57 ఏళ్లలో కూడా ఫిట్‌గా.. ఆశ్చర్యపరిచే సిక్రెట్‌!

ప్రయాణికులు ఇప్పుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సీట్‌ కోసం వెతుకుతున్నారు. ముఖ్యంగా 11A – ఇది మెరుగైన మనుగడ అవకాశాలను అందిస్తుందని నమ్ముతున్నారు. నాకు 11A సీటు కావాలి, లేదా అత్యవసర నిష్క్రమణ దగ్గర ఉన్న ఏ సీటు అయినా కావాలి అని కోల్‌కతా నుండి తరచుగా ప్రయాణించే రాజేష్ భగ్నాని చెబుతున్నాడు. విశ్వష్‌కుమార్ బతికిన తర్వాత ఆ సీటు కోసం డిమాండ్‌ పెరిగిందట. మరో ప్రయాణికుడు, వ్యాపారవేత్త జితేందర్ సింగ్ బగ్గా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీని కోసం నేను ఏదైనా అదనపు మొత్తాన్ని ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.. నాకు ఆ సీటు కావాలి అంటూ అమెరికాకు వెళ్లబోయే తన విమాన ప్రయాణాన్ని ప్రస్తావిస్తూ అన్నారు. 11A ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సీట్‌ పక్కన లేనప్పుడు కూడా, ప్రయాణికులు దాని కోసం అడుగుతున్నారు అని ట్రావెల్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు చెందిన అనిల్ పంజాబీ అన్నారు.

ఇవి కూడా చదవండి

సీట్ 11A సురక్షితమైనదా?

విమానాల సీట్ల కాన్ఫిగరేషన్‌లు చాలా వరకు మారుతూ ఉంటాయి. మనుగడ తరచుగా సంక్లిష్టమైన అంశాల పరస్పర చర్యపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ సీటు అన్నింటికి సురక్షితం కాకపోవచ్చని విమానయాన నిపుణులు అంటున్నారు. ఎందుకంటే విమానాలను బట్టి ఈ సీటు మారుతూ ఉంటుంది. ప్రతి ప్రమాదం భిన్నంగా ఉంటుంది. అలాగే సీటు స్థానం ఆధారంగా మనుగడను అంచనా వేయడం అసాధ్యం అని అమెరికాకు చెందిన ఫ్లైట్ సేఫ్టీ ఫౌండేషన్ డైరెక్టర్ మిచెల్ ఫాక్స్ అన్నారు. గురువారం అహ్మదాబాద్‌లో కూలిపోయిన లండన్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్‌లో తన 11A ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సీటు దగ్గర ఉందని, అతను బయటకు వెళ్లగలిగాడని రమేష్ విశ్వష్‌కుమార్ అన్నారు.

ఇది కూడా చదవండి: HIV Injection: గుడ్‌న్యూస్‌.. ఇక హెచ్‌ఐవీకి వ్యాక్సిన్‌ వచ్చేసింది.. ఎఫ్‌డీఏ ఆమోదం

ఎగ్జిట్ డోర్ పక్కన కూర్చోవడం వల్ల ప్రమాదం నుండి బయటపడటానికి మీకు సహాయపడవచ్చు. కానీ అది ఎల్లప్పుడూ 11A కాదు. ఎందుకంటే విమానం డజన్ల కొద్దీ విభిన్న కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంటుంది. ఈ ప్రత్యేక సందర్భంలో ప్రయాణికుడు అత్యవసర నిష్క్రమణ పక్కన కూర్చున్నందున ఇది ఆ రోజు అత్యంత సురక్షితమైన సీటు అని స్పష్టంగా తెలుస్తుందని సిడ్నీకి చెందిన అవ్‌లా ఏవియేషన్ కన్సల్టింగ్ చైర్మన్ రాన్ బార్ట్ష్ అన్నారు. కానీ ఇది ఎల్లప్పుడూ 11A సీటు ఉండదు. బోయింగ్ 787 ఈ కాన్ఫిగరేషన్‌లో ఇది కేవలం 11A మాత్రమే. విశ్వష్‌కుమార్ వంటి వారు ఎమర్జెన్సీ ఎగ్జిట్‌ సీటు పక్కన కూర్చోవడం వల్ల విమానం నుండి మొదట బయట పడే వారిలో ఒకరిగా ఉండటానికి మీకు అవకాశం లభిస్తుంది. అయితే ప్రమాదం తర్వాత కొన్ని ఇలాంటి ఎమర్జెన్సీ డోర్స్‌ పనిచేయవని నిపుణులు చెబుతున్నారు.

ఇది కూడా చదవండి: BSNL 5G: బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 5జీ సేవలు ప్రారంభం.. సిమ్‌ లేకుండానే ఇంటర్నెట్‌

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us