Budget 2022: డిజిటల్ యూనివర్సిటీలు స్థాపిస్తాం.. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తాం..

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీలను స్థాపించనున్నట్లు వెల్లడించారు...

Budget 2022: డిజిటల్ యూనివర్సిటీలు స్థాపిస్తాం.. ఒక్కో తరగతికి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తాం..
Nirmala

Updated on: Feb 01, 2022 | 3:03 PM

కరోనా పరిస్థితుల నేపథ్యంలో విద్యా రంగంపై దృష్టి సారించినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. డిజిటల్ యూనివర్సిటీలను స్థాపించనున్నట్లు వెల్లడించారు. పీఎం విద్యలో భాగంగా ఛానళ్ల సంఖ్యను 12 నుంచి 200 పెంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈ-కంటెంట్‌లో నాణ్యత పెంచుతామన్నారు. విద్యలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అడాప్షన్‌ చేసుకుని హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు.ఒక్కో తరగతి ఒక్కో ఛానల్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. వీటిని అన్ని రాష్ట్రాల్లో 1 నుండి 12 తరగతులకు ప్రాంతీయ భాషలలో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

పాఠశాలలు, కళాశాలల మూసివేత కారణంగా విద్యార్థులు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించిందని ఆమె తెలిపారు.రేడియో, టీవీ, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల కోసం అన్ని భాషల్లో ఈ-కంటెంట్‌ను అభివృద్ధి చేస్తామని సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. నాణ్యమైన విద్యకు ప్రాప్యతను మెరుగుపరచడానికి ఈ-కంటెంట్, ఈ-విద్యా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు ఆమె చెప్పారు. మహమ్మారి కారణంగా రెండేళ్ల విద్యారంగానికి అంతరాయం ఏర్పడిందన్నారు.

Read Also.. Budget 2022: బడ్జెట్ ప్రసంగం చిన్నదే.. కానీ ప్రభావం ఎక్కువ ఉండొచ్చు.. ఆనంద్ మహీంద్రా ట్వీట్..