ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు ఉభయసభల్లో చర్చ

| Edited By:

Feb 23, 2019 | 9:54 AM

హైదరాబాద్‌ : నిన్న తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవల మృతి చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌, జీఎస్టీ బిల్లులకు సవరణలు చేస్తూ […]

ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై నేడు ఉభయసభల్లో చర్చ
Follow us on

హైదరాబాద్‌ : నిన్న తెలంగాణ శాసనసభలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పై ఇవాళ ఉభయసభల్లో చర్చ జరగనుంది. బడ్జెట్‌పై చర్చ జరిగిన అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానం ఇవ్వనున్నారు. ఇవాళ సభ ప్రారంభం కాగానే మాజీ గవర్నర్‌ ఎన్డీ తివారీతో పాటు ఇటీవల మృతి చెందిన 15 మంది మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం తెలుపుతూ తీర్మానం చేయనున్నారు. సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించనున్నారు. ఆ తర్వాత పంచాయతీరాజ్‌, జీఎస్టీ బిల్లులకు సవరణలు చేస్తూ ఇటీవల తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌లను బిల్లుగా సభ ముందు ప్రవేశపెడతారు.