AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కాంగ్రెస్ కు భారీ షాక్… టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు పార్టీని వీడనున్నారు. ఇవాళ వీరిద్దరూ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా అధికారికంగా ప్రకటించారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలను కూడా గాంధీభవన్‌కు […]

కాంగ్రెస్ కు భారీ షాక్... టీఆర్ఎస్ లోకి ఇద్దరు ఎమ్మెల్యేలు
TV9 Telugu Digital Desk
|

Updated on: Mar 03, 2019 | 8:30 AM

Share

తెలంగాణలో మరోసారి ఫిరాయింపుల పర్వం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు. గడచిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై విజయం సాధించిన ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావులు పార్టీని వీడనున్నారు. ఇవాళ వీరిద్దరూ కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా అధికారికంగా ప్రకటించారు. తాము కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖలను కూడా గాంధీభవన్‌కు పంపించామని.. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేస్తామని ఇద్దరు ఎమ్మెల్యేలు ప్రకటించారు. 2018 డిసెంబర్‌లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19 సీట్లు గెలిచింది. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు వీడనుండడంతో అసెంబ్లీలో కాంగ్రెస్ బలం 17కి పడిపోయింది.

కాగా, రానున్న ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం ఐదు స్థానాలనూ తమ ఖాతాలో వేసుకునేందుకు టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపగా, దాదాపు 10 మంది వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరవచ్చని తెలుస్తోంది. ఒక ఎమ్మెల్సీ సీటు గెలుచుకోవడానికి 21 మంది ఎమ్మెల్యేలు అవసరం. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం టీఆర్ఎస్ పార్టీకి నాలుగు ఎమ్మెల్సీ సీట్లు వస్తాయి. అయితే, ఐదో అభ్యర్థిని కూడా టీఆర్ఎస్ బరిలోకి దింపింది. అయితే, కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు నారాయణరెడ్డిని బరిలోకి దించారు. తమకు ఉన్న ఎమ్మెల్యేలతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తే ఒక్క సీటు గెలుచుకోవచ్చని హస్తం నేతలు అంచనా వేశారు. ఇప్పుడు ఇద్దరు ఎమ్మెల్యేలు జారిపోవడంతో ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలుచుకోవడం కష్టమే అంటున్నారు. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి) సైతం శనివారం కేసీఆర్ ను కలిశారు. ఆయన కూడా కారు ఎక్కనున్నట్లు తెలుస్తోంది.

Follow Us
నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె..
నాకు చాలా ఇష్టమైన హీరోయిన్ ఆమె..
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే... 30 మంది..
పెళ్లి వేడుకలో మిగిలిన పాయసం కాలనీవాసులకు పంచితే... 30 మంది..
పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
పోతూపోతూ ప్రపంచ రికార్డుతో గర్జించిన పాక్ ప్లేయర్..!
జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు..
జూలైలో కుజుడి రాశి మార్పు.. ఈ 4 రాశులకు భారీ ధనలాభం, 4 రాశులు..
బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? వెంటనే మార్చండి!
బెడ్‌రూమ్, కిచెన్ గోడలకు ఈ రంగులు వేస్తున్నారా? వెంటనే మార్చండి!
అటు యుద్ధపీడితమై... ఇటు ప్రకృతి వికృతించి.. ఎడాపెడా పరేషాన్లతో...
అటు యుద్ధపీడితమై... ఇటు ప్రకృతి వికృతించి.. ఎడాపెడా పరేషాన్లతో...
కారు లోన్‌పై EMIలు చెల్లించకపోతే బ్యాంకు కారును జప్తు చేయగలదా?
కారు లోన్‌పై EMIలు చెల్లించకపోతే బ్యాంకు కారును జప్తు చేయగలదా?
ఒక్క ఇటుక కదలకుండా ఇల్లంతా ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తున్నారు..
ఒక్క ఇటుక కదలకుండా ఇల్లంతా ట్రక్కులో ఎక్కించి తీసుకెళ్తున్నారు..
హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్
హైదరాబాద్ నుంచి వర్షాకాలంలో వెళ్లాల్సిన 8 బెస్ట్ వీకెండ్ ట్రిప్స్
AI తర్వాత కొత్త టెక్నాలజీ.. సంచలనాలకు రెడీ
AI తర్వాత కొత్త టెక్నాలజీ.. సంచలనాలకు రెడీ