హిమాచల్లో మంచు చరియలు విరిగి పడి ఆరుగురు జవాన్లు మృతి

| Edited By: Srinu

Mar 07, 2019 | 6:31 PM

హిమాచల్ ప్రదేశ్లో మంచు చరియలు విరిగి పడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మ‌ృతి చెందారు. కిన్నౌర్ జిల్లాలోని సంగ్య రీజియన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జవాన్లు దాని కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు జవాన్లు మంచు కింద చిక్కుకున్నారు. ఒక జవాను మృతదేహాన్ని వెలికితీశారు. మిగతావారిని వెలికితీసేందుకు […]

హిమాచల్లో మంచు చరియలు విరిగి పడి ఆరుగురు జవాన్లు మృతి
Follow us on

హిమాచల్ ప్రదేశ్లో మంచు చరియలు విరిగి పడటంతో ఐటీబీపీకి చెందిన ఆరుగురు జవాన్లు మ‌ృతి చెందారు. కిన్నౌర్ జిల్లాలోని సంగ్య రీజియన్ ప్రాంతంలో మంచు చరియలు విరిగి పడ్డాయి. ఆ సమయంలో ఐటీబీపీ, స్థానిక జిల్లా పోలీసులు భద్రతా విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా మంచు చరియలు విరిగిపడటంతో జవాన్లు దాని కింద కూరుకుపోయారు. ఈ ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు జవాన్లు మంచు కింద చిక్కుకున్నారు. ఒక జవాను మృతదేహాన్ని వెలికితీశారు. మిగతావారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.