AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకుని వారాంతాన్ని లాభాలతో ముగించాయి. పాకిస్థాన్‌ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అద్యంతం అదే జోరును కొనసాగించాయి. ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. ఐటీ, […]

లాభాలతో ముగిసిన స్టాక్‌మార్కెట్‌
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2019 | 7:22 PM

Share

ముంబయి: మూడు రోజుల వరుస నష్టాల నుంచి దేశీయ సూచీలు కోలుకుని వారాంతాన్ని లాభాలతో ముగించాయి. పాకిస్థాన్‌ అదుపులో ఉన్న భారత వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ను విడుదల చేస్తామని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ ప్రకటించిన నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉండటం మార్కెట్‌కు కలిసొచ్చింది. లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు అద్యంతం అదే జోరును కొనసాగించాయి.

ఉదయం 200 పాయింట్లకు పైగా లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ కొనుగోళ్ల అండతో దూసుకెళ్లింది. ఐటీ, బ్యాంకింగ్‌ రంగాల్లో కొనుగోళ్లు కలిసొచ్చాయి. సెన్సెక్స్‌ 196 పాయింట్లు లాభపడి 36,064 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 71 పాయింట్లు లాభపడి 10,863.50 వద్ద స్థిరపడింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 70.80 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, హిందుస్థాన్‌ పెట్రోలియం, బీపీసీఎల్‌, ఐఓసీ, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌ఎసీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. భారతీ ఎయిర్‌టెల్‌, బజాజ్‌ ఆటో, యాక్సిస్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు నష్టపోయాయి.