ఎస్బీఐ గుర్తి౦చిన మోసాల విలువ రూ .8 వేల కోట్లు
2108 ఏప్రిల్-డిసెంబర్లో 1,885 మోసాల్ని గుర్తించామని, వీటి విలువ రూ.7,951.3 కోట్లని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.723.06 కోట్ల మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన 669 కేసులను వెలుగులోకి తెచ్చామని చెప్పింది. అలాగే జూలై-సెప్టెంబర్లో 660, అక్టోబర్-డిసెంబర్లో 556 కేసుల్ని గుర్తించామన్న ఎస్బీఐ.. వీటి విలువ వరుసగా రూ.4,832.42 కోట్లు, రూ.2,395.81 కోట్లని […]
2108 ఏప్రిల్-డిసెంబర్లో 1,885 మోసాల్ని గుర్తించామని, వీటి విలువ రూ.7,951.3 కోట్లని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ తెలిపింది. సమాచార హక్కు చట్టం కార్యకర్త చంద్రశేఖర్ గౌడ్ అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో రూ.723.06 కోట్ల మోసపూరిత లావాదేవీలకు సంబంధించిన 669 కేసులను వెలుగులోకి తెచ్చామని చెప్పింది. అలాగే జూలై-సెప్టెంబర్లో 660, అక్టోబర్-డిసెంబర్లో 556 కేసుల్ని గుర్తించామన్న ఎస్బీఐ.. వీటి విలువ వరుసగా రూ.4,832.42 కోట్లు, రూ.2,395.81 కోట్లని వివరించింది.