వాళ్ల భయంతో 6 కేంద్రాల్లో జరగని పోలింగ్

ఒడిషా : ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పెరగడం సహజం. కానీ ఓటర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండటం మాత్రం నిజంగా పెద్ద విషయమే అని చెప్పాలి. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పరిధిలోని 6 పోలింగ్ బూత్‌లలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మల్కాన్ గిరి జిల్లాలోని చిత్రకొండ, మతిలి పరిధిలోని 6 బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలు […]

వాళ్ల భయంతో 6 కేంద్రాల్లో జరగని పోలింగ్

Updated on: Apr 11, 2019 | 7:52 PM

ఒడిషా : ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గడం, పెరగడం సహజం. కానీ ఓటర్లు ఎన్నికలకు పూర్తిగా దూరంగా ఉండటం మాత్రం నిజంగా పెద్ద విషయమే అని చెప్పాలి. ఒడిశాలోని మల్కాన్‌గిరి జిల్లా పరిధిలోని 6 పోలింగ్ బూత్‌లలో ఇదే రకమైన పరిస్థితి నెలకొంది. మల్కాన్ గిరి జిల్లాలోని చిత్రకొండ, మతిలి పరిధిలోని 6 బూత్‌లలో ఒక్క ఓటు కూడా నమోదు కాలేదని తెలుస్తోంది. మావోయిస్టుల ప్రభావం అధికంగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటింగ్‌కు దూరంగా ఉండాలని ప్రజలు నిర్ణయించుకోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని సమాచారం. కొద్ది రోజుల క్రితం నుంచి ఎన్నికలను బహిష్కరించాలని మావోయిస్టులు పిలుపునివ్వడం కూడా ఓటర్లపై ప్రభావం చూపిందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు కలహంది ప్రాంతానికి చెందిన ఓటర్లు తమ ప్రాంతంలో అభివృద్ధి జరగడం లేదనే కారణంగా ఎన్నికలను బహిష్కరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us