అర్ధరాత్రులు ఫోన్ చేస్తున్నారు: సాధినేని యామిని
విజయవాడ: పలువురు తనకు అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరుపున ఆమె పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగం కార్యదర్శి శ్యాం కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్ అశోక్, రాము, మధుసూధన రెడ్డి, లక్ష్మీ సుజాత తదితరులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు […]
విజయవాడ: పలువురు తనకు అర్ధరాత్రులు ఫోన్ చేసి వేధిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె తరుపున ఆమె పీఆర్వో పొట్లూరి వెంకట సుధీర్ గుంటూరు జిల్లాలోని పట్టాభిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వైసీపీ ఐటీ విభాగం కార్యదర్శి శ్యాం కలకాల, మానుకొండ రామిరెడ్డి, వైఎస్సార్ అశోక్, రాము, మధుసూధన రెడ్డి, లక్ష్మీ సుజాత తదితరులపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చారు.
సాధినేని యామినికి ప్రతిరోజూ 20 నుంచి 30 వరకూ ఫోన్లు వస్తున్నాయని అసభ్యంగా మాట్లాడుతున్నారని యామిని అంటున్నారు. తన ఫోన్ నంబర్ను కొందరు ఫేస్బుక్లో పోస్ట్ చేశారని దీని కారణంగానే ఫోన్లు పెరిగిపోయాయని, ఈ మధ్య అర్ధరాత్రి కూడా ఫోన్లు చేసి మానసికంగా వేధిస్తున్నారని యామిని అంటున్నారు. మెస్సేజ్లు అయితే అసభ్యకరంగా ఉంటున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.