‘‘కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఓ పాము అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఓ ముంగీస’’ అని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కామెంట్లు చేశారు. ఆ ఇద్దరు కలిసి తెలంగాణలో అధికారంలోకి రావడానికి చేతులు కలిపారని కానీ ప్రజలు వారికి మంచి బుద్ధి చెప్పారని ఆయన అన్నారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన మాజీ సర్పంచ్లు, జేడ్పీటీసీలు, ఎమ్పీటీసీలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబునాయుడుపై ఫైర్ అయ్యారు. మోసం, వెన్నుపోటుకు చంద్రబాబునాయుడు కేరాఫ్ అని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడును ఓడించాలని టీఆర్ఎస్ నేతలు వెళ్లి ఏపీలో ప్రచారం చేయాల్సిన అవసరం లేదని, వచ్చే ఎన్నికల్లో అక్కడి ప్రజలే ఆయనకు గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు.