AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ

ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. మే నెలాఖరు వరకు అవసరాల కోసం ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను కోరింది. ఇవాళ్టి వరకు నాగార్జున సాగర్ లో 31.641 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టానికి 4.861 టీఎంసీల దిగువన నీరు ఉందని పేర్కొంది. శ్రీశైలంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని బోర్డు సూచించింది.

తెలుగు రాష్ట్రాలకు కృష్ణా బోర్డు లేఖ
Ram Naramaneni
|

Updated on: Mar 01, 2019 | 5:00 PM

Share

ఢిల్లీ: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు లేఖ రాసింది. మే నెలాఖరు వరకు అవసరాల కోసం ప్రతిపాదనలు పంపాలని రెండు రాష్ట్రాలను కోరింది. ఇవాళ్టి వరకు నాగార్జున సాగర్ లో 31.641 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని బోర్డు తెలిపింది. శ్రీశైలంలో కనీస నీటి వినియోగ మట్టానికి 4.861 టీఎంసీల దిగువన నీరు ఉందని పేర్కొంది. శ్రీశైలంలో ఉన్న పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదనలు ఇవ్వాలని బోర్డు సూచించింది.