ఇండియన్ ఫుట్‌బాల్ లెజండ్ కన్నుమూత

| Edited By:

Mar 20, 2020 | 4:56 PM

ఇండియన్ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ప్రదీప్ కుమార్‌ బెనర్జీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన్‌గా వ్యవహరించిన ఆయన.. 65 గోల్స్‌ సాధించారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ కుమార్‌ బెనర్జీ.. కోచ్‌గా కూడా […]

ఇండియన్ ఫుట్‌బాల్ లెజండ్ కన్నుమూత
Follow us on

ఇండియన్ ఫుట్‌బాల్‌ మాజీ కెప్టెన్‌ ప్రదీప్ కుమార్‌ బెనర్జీ శుక్రవారం కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. గత కొంతకాలంగా న్యుమోనియాతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురై కోల్‌కతాలో తుదిశ్వాస విడిచారు. 1962లో జకార్తాలో జరిగిన ఆసియా గేమ్స్‌లో గోల్డ్ మెడల్ సాధించారు. ఇండియా తరఫున 84 మ్యాచ్‌లకు కెప్టన్‌గా వ్యవహరించిన ఆయన.. 65 గోల్స్‌ సాధించారు. భారత జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించిన ప్రదీప్ కుమార్‌ బెనర్జీ.. కోచ్‌గా కూడా పనిచేశారు. ప్రదీప్‌కు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా తమ్ముడు ప్రసూన్‌ బెనర్జీ.. టీఎంసీ నుంచి ఎంపీగా ఉన్నారు.
ఇండియన్ ఫుట్‌బాల్‌కు ప్రదీప్ కుమార్ బెనర్జీ చేసిన సేవలకు.. ప్రపంచ పాలక మండలి ఫిఫా.. 2004 సంవత్సరంలో సెంటెనియల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ను ప్రదానం చేసింది. బెనర్జీ మరణం పట్ల పలువురు క్రీడాకారులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.