‘ఐ యామ్ ఫైన్…స్వీయ నియంత్రణలో లేను’.. మహారాష్ట్ర గవర్నర్

| Edited By: Pardhasaradhi Peri

Jul 12, 2020 | 3:51 PM

తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లలేదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదివారం  ప్రకటించారు.  తన హెల్త్ పై మీడియాలో వస్తున్న వార్తలను నిరాధారమైనవిగా ఆయన కొట్టిపారేశారు. నేను అన్ని టెస్టులూ చేయించుకున్నా.. ఎలాంటి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలూ లేవు.. ఈ టెస్టుల ఫలితాలన్నీ నెగెటివ్ అనే వచ్చాయి’ అని కోష్యారీ స్పష్టం చేశారు. అంతే కాదు.. తను కరోనా వైరస్ కి సంబంధించిన ప్రోటోకాల్ నిబంధనలన్నీ పాటిస్తున్నట్టు  ఆయన పేర్కొన్నారు. […]

ఐ యామ్ ఫైన్...స్వీయ నియంత్రణలో లేను.. మహారాష్ట్ర గవర్నర్
Follow us on

తన ఆరోగ్యం భేషుగ్గా ఉందని, సెల్ఫ్ ఐసోలేషన్ లోకి వెళ్లలేదని మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ ఆదివారం  ప్రకటించారు.  తన హెల్త్ పై మీడియాలో వస్తున్న వార్తలను నిరాధారమైనవిగా ఆయన కొట్టిపారేశారు. నేను అన్ని టెస్టులూ చేయించుకున్నా.. ఎలాంటి కోవిడ్-19 పాజిటివ్ లక్షణాలూ లేవు.. ఈ టెస్టుల ఫలితాలన్నీ నెగెటివ్ అనే వచ్చాయి’ అని కోష్యారీ స్పష్టం చేశారు. అంతే కాదు.. తను కరోనా వైరస్ కి సంబంధించిన ప్రోటోకాల్ నిబంధనలన్నీ పాటిస్తున్నట్టు  ఆయన పేర్కొన్నారు.

అటు-రాజ్ భవన్ లో పని చేసే 16 మంది సిబ్బందికి కరోనా పాజిటివ్ అని తేలిందని, వారిని క్వారంటైన్ కి తరలించారని వార్తలు వచ్చాయి.