
మేడ్చల్జిల్లా కీసరగుట్టలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. గుట్టపై రాత్రి వేళల్లో కొందరు గుర్తుతెలియని దుండగులు తవ్వకాలు జరిపారు. కొబ్బరికాయలు కొట్టి, నిమ్మకాయలతో క్షూద్ర పూజలు చేశారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపినట్టు ఆనవాలు కనిపిస్తున్నాయి.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనతో పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపిన దుండగుల కోసం గాలిస్తున్నారు. అయితే పవిత్ర పుణ్యక్షేత్రంలో తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారిపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.