జమ్మూకశ్మీర్లో భద్రతా దళాలు భారీ స్థాయిలో ఆర్డీఎక్స్ పేలుడు పదార్ధాన్ని స్వాధీనం చేసుకున్నాయి. జమ్మూలోని ఓ బస్టాండ్లో ఆగి ఉన్న బస్సు నుంచి సుమారు 15 కిలోల ఆర్డీఎక్స్ను సీజ్ చేశారు. కథువా జిల్లాలోని బిలావర్ నుంచి జమ్మూకు ఆ బస్సు వచ్చినట్లు అనుమానిస్తున్నారు. ఇటీవలే బిలావర్లోని ఓ ప్రాంతం నుంచి పోలీసులు సుమారు 40 కేజీల గన్ పౌడర్ను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే.