తెలంగాణకు వెదర్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండ్రోజుల పాటు ఈ హెచ్చరిక ప్రబావం వుంటుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం సీనియర్ సైంటిస్టు రాజారావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. దాంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

తెలంగాణకు వెదర్ వార్నింగ్

Updated on: Jul 21, 2020 | 3:57 PM

తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రెండ్రోజుల పాటు ఈ హెచ్చరిక ప్రబావం వుంటుందని తెలిపింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ విభాగం సీనియర్ సైంటిస్టు రాజారావు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. దాంతో రాష్ట్ర అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

బుధ, గురువారాల్లో అంటే జులై 22, 23 తేదీల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం జారీ చేసిన హెచ్చరిక ప్రధాన సారాంశం. సీనియర్ సైంటిస్టు రాజారావు చెబుతున్న వివరాల ప్రకారం నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతుండడంతోపాటు దక్షిణ భారత రాష్ట్రాలపై రెండు భూ ఉపరితల ద్రోణులు ఏర్పడడం వల్ల తెలంగాణలో భారీ వర్షాలకు అవకాశం వుందని తెలుస్తోంది.

నైరుతీ రుతుపవనాలు చురుకుగా కదులుతూ వుండడంతో అనేక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ విభాగం పేర్కొంది. మంగళవారం కూడా తెలంగాణలోని చాలా చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని మెట్ శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. నైరుతీ రుతుపవనాలకు ఉపరితల ఆవర్తన ద్రోణులు తోడవడంతో వర్షాలకు చాన్స్ ఏర్పడిందని వారు చెబుతున్నారు.

దక్షిణ ఇంటీరియర్ కర్నాటక మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతున్న ఉత్తర-దక్షిణ ద్రోణి, ఉత్తర ఇంటీరియర్ కర్నాటక ప్రాంతాలలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం కలిసి వర్షాలు కురిసేందుకు కారణమవుతున్నాయిన వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు వెల్లడించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us