నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేయాలనుకుంటున్నారు: బండ్ల గణేష్

| Edited By:

Oct 05, 2019 | 10:41 AM

సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్‌.. ఇద్దరి మధ్య అర్థరాత్రి వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి బండ్ల గణేష్.. అతని అనుచరులు వచ్చి.. తనపై దాడి చేశారని.. గణేష్‌, అతని అనుచరులపై పీవీపీ ఫిర్యాదు చేశారు. అదే తరహాలో.. ఆర్థిక వ్యవహారాలు ప్రస్తావిస్తూ.. గణేష్ కూడా జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పీవీపీ.. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ […]

నన్ను కిడ్నాప్ చేసి.. హత్య చేయాలనుకుంటున్నారు: బండ్ల గణేష్
Follow us on

సినీ నిర్మాతలు పీవీపీ, బండ్ల గణేష్‌.. ఇద్దరి మధ్య అర్థరాత్రి వివాదం చోటుచేసుకుంది. ఒకరిపై మరొకరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. అర్థరాత్రి బండ్ల గణేష్.. అతని అనుచరులు వచ్చి.. తనపై దాడి చేశారని.. గణేష్‌, అతని అనుచరులపై పీవీపీ ఫిర్యాదు చేశారు. అదే తరహాలో.. ఆర్థిక వ్యవహారాలు ప్రస్తావిస్తూ.. గణేష్ కూడా జూబ్లిహిల్స్ పోలీస్‌ స్టేషన్ ఫిర్యాదు చేశారు. పీవీపీ.. తనను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని బండ్ల గణేష్ ఫిర్యాదు చేశారు.

వివరాల్లోకి వెళ్లితే.. టెంపర్ సినిమాకు గాను పీవీపీ నుంచి రూ.7 కోట్లు.. ఫైనాన్స్ కింద తీసుకున్న గణేష్. అనంతరం సినిమా విడుడదల సమయంలో అసలు మొత్తాన్ని చెల్లించి ఇంకొంత మొత్తానికి గానూ గణేష్ చెక్కులను ఇచ్చారు. కాగా.. మిగిన అమౌంట్‌ ఇంకా రాకపోవడంతో.. గతరాత్రి బండ్ల గణేష్‌కు ఫోన్.. చేసి డబ్బులు అడిగిన పీవీపీ. దీంతో.. ఆగ్రహం వ్యక్తం చేసిన బండ్ల గణేష్.. రాత్రి పీవీపీ ఇంటిపై దాడి చేసి.. అనుచరులతో కలిసి వెళ్లి బెదిరించాడు. ఆ తర్వాత జూబ్లిహిల్స్‌ పీఎస్‌లో.. బండ్ల గణేష్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన పీవీపీ. బండ్లగణేష్ సహా మరో నలుగురిపై కేసులు నమోదయ్యాయి. అయితే.. బండ్లగణేష్‌ పరారీలో ఉన్నాడని వార్తలు వచ్చినా.. అతని కూడా వెళ్లి పీఎస్‌లో పీవీపీపై కేస్ బుక్ చేశారు.