హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!

|

Sep 21, 2020 | 8:27 AM

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా […]

హత్యతో ఉలిక్కిపడ్డ ధార్మిక నగరం.!
Follow us on

రౌడీ షీటర్ హత్యతో ధార్మిక నగరం తిరుపతి ఉలిక్కి పడింది. గిరిపురంలో ప్రత్యర్థులు దినేష్ అనే వ్యక్తిని రాత్రి హత్య చేశారు. జీప్ డ్రైవర్ అయిన దినేష్ పై కత్తులతో దాడి చేసి పొడిచి చంపేశారు. గిరిపురంలో గతేడాది డిసెంబర్లో హత్యకు గురైన భార్గవ్ కేసులో నిందితుడిగా ఉన్న బెల్ట్ మురళిని కొర్లగుంట సర్కిల్ లో ప్రత్యర్థులు నరికి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో దినేష్ నిందితుడిగా ఉన్నాడు. కాగా, దినేష్ హత్య ప్రతీకార హత్యగా భావిస్తున్నారు పోలీసులు. అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి.. బాధిత కుటుంబ సభ్యుల్ని, స్థానికులను విచారించి హత్య పై ఆరా తీశారు. హత్య జరిగిన ప్రాంతంలోని సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను పట్టుకుకోవాలని ఆదేశించారు. ఘటనలో ఐదుగురు పాల్గొన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు. ఇప్పటికే వినయ్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని తిరుపతి పశ్చిమ పోలీసులు విచారిస్తున్నారు.